Hyderabad: అక్కడ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ వస్తుందా?
ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు ఎన్నికల తర్వాత మెట్రో విస్తరణ ఉంటుందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించడంతో ఆ ప్రాంతవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ఎల్బీనగర్-మల్కాపూర్ మార్గంలో జాతీయ రహదారి విస్తరణ
నాగ్పూర్లో పైన మెట్రో, కింద రహదారి
ఈనాడు, హైదరాబాద్: ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు ఎన్నికల తర్వాత మెట్రో విస్తరణ ఉంటుందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ప్రకటించడంతో ఆ ప్రాంతవాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. భవిష్యత్తులో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు ఇంజినీర్లు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇదే మార్గంలో ప్రస్తుతం ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు 25 కి.మీ. మేర జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలు కావాల్సి ఉంది. ఇందులో భాగంగా వాహనాలు సాఫీగా వెళ్లేందుకు వీలుగా కొన్నిచోట్ల పైవంతెనలను ప్రతిపాదించారు. వాటిని నిర్మిస్తే .. మెట్రో మార్గం రహదారి మధ్యలో కాకుండా సర్వీసు దారిలో భవనాల పక్క నుంచి వెళ్లాల్సి వస్తుంది. విస్తరణ పనులు చేపడుతున్న ఆర్ అండ్ బీ, హైదరాబాద్ మెట్రో సమన్వయంతో వ్యవహరిస్తే నాగ్పూర్ మాదిరి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్తో కింద రహదారి, పైన మెట్రో వెళ్లేలా డిజైన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఖర్చూ కలిసి వస్తుంది. రెండుసార్లు పనులతో వాహనదారులకు ఇబ్బందులే కాకుండా.. ఇప్పుడు కొత్తగా నిర్మించే రహదారినీ తవ్వాల్సి వస్తుంది. ఏ రకంగా చూసినా ఏకకాలంలో రెండు పనులను చేయడం ఉత్తమం.
నాగ్పూర్లో ఇంజినీరింగ్ పరిష్కారంతో.. : నాగ్పూర్లో ఐదేళ్ల క్రితం జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మించాలని నిర్ణయించారు. ఇదే మార్గంలో మెట్రోరైలు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక్కడే అధికారులు ఇంజినీరింగ్ పరిష్కారం ఆలోచించారు. కేంద్ర మంత్రి గడ్కరీ ప్రోత్సహించారు. ఫలితంగా జాతీయ రహదారులు, మెట్రోరైలు సంస్థ సమన్వయంతో డబుల్ డెక్కర్ వయాడక్ట్ నిర్మాణ డిజైన్ను రూపొందించాయి. దీంతో అదనంగా భూసేకరణ తిప్పలు తప్పాయి. నిర్మాణ వ్యయం 40 శాతం తగ్గింది. సమయం ఆదా అయింది. ఒకే స్తంభంపై 3.4 కి.మీ. దూరం ఫ్లైఓవర్, మెట్రో నిర్మాణంతో నాగ్పూర్ మెట్రో ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు ఎక్కింది.
ఇప్పుడు ఎంత కష్టమో చూడండి... : బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ (వయా కొండాపూర్) వరకు ప్రతిపాదిత మెట్రోరైలు రెండోదశ మార్గంలోనే నాలుగు ఫ్లైఓవర్లను నిర్మించాలని నిర్ణయించారు. ఒకే మార్గంలో మెట్రో, ఫ్లైఓవర్లు వస్తుండటంతో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టేందుకు పురపాలక, జీహెచ్ఎంసీ అధికారులు, నాటి మేయర్ నాగ్పూర్ వెళ్లి అధ్యయనం చేసి వచ్చారు. కానీ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ లేకుండానే షేక్పేట్, బయోడైవర్సిటీ, కొత్తగూడలో ఫ్లైఓవర్లు నిర్మించారు. ఇప్పుడు రెండోదశలో ఈ మార్గంలో మెట్రోకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రైట్ ఆఫ్ వే పెద్ద సమస్యగా మారింది. చాలా చోట్ల భూసేకరణ సమస్యలు తలెత్తనున్నాయి.
ఆర్ అండ్ బీ సానుకూలం: ఎల్బీనగర్-మల్కాపూర్ మార్గంలో విస్తరణ ఎన్హెచ్ఏఐ నిధులతో చేపడుతున్నా.. పనుల బాధ్యత ఆర్అండ్ బీదే. మెట్రో విస్తరణకు అనుగుణంగా పనిచేసేందుకు తాము సిద్ధమని.. కావాలంటే కొన్నిరోజులు వాయిదా వేస్తామని ఆర్ అండ్ బీ అధికారులు అంటున్నారు. దీనిపై మెట్రో అధికారులు స్పందించాల్సి ఉంటుంది.
గడ్కరీ అప్పుడే సూచన.. : నగరాల్లో జాతీయ రహదారుల విస్తరణ ప్రణాళికలు భవిష్యత్తులో మెట్రో ఏర్పాటుకు అనుగుణంగా ఉండాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే సూచించారు. అలా లేని ప్రణాళికలను ఆయన తిప్పి పంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం