నిబంధనలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ!
రాజధాని సికింద్రాబాద్లోని ఓ భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.. పెద్దఎత్తున మంటలు.. దట్టమైన పొగ వ్యాపించడంతో.. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు బయటకు పరుగులు తీశారు.
న్యూస్టుడే, తాండూరు టౌన్, పరిగి, కొడంగల్, వికారాబాద్ మున్సిపాలిటీ
రాజధాని సికింద్రాబాద్లోని ఓ భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.. పెద్దఎత్తున మంటలు.. దట్టమైన పొగ వ్యాపించడంతో.. ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు బయటకు పరుగులు తీశారు. ఇరుకుగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తం కావాలన్న విషయాన్ని సూచిస్తోంది. రానున్నది ఎండాకాలం ఇప్పటి నుంచే జాగ్రత్త తీసుకోవడంతోపాటు, నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి. ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యాచరణ చేపడితే ప్రయోజనం ఉంటుంది.
తాండూరులో ఇరుకుగా
తాండూరు మహాత్మా గాంధీ కూడలి ప్రాంతం..
పట్టణంలో 15 వేల వరకు నివాస గృహాలు, 800 దాకా దుకాణాలున్నాయి. 100 వరకు పైఅంతస్తుల భవనాల్లో వివిధ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. వీటిల్లో నిబంధనలు కానరావటం లేదు. మహాత్మా గాంధీ కూడలి నుంచి వినాయక కూడలి, భద్రేశ్వర దేవాలయం, నేతాజీ కూడలి, శివాజీ కూడలి, అంబేడ్కర్ కూడలి తదితర ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల్లో వివిధ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వాటితో పాటు కొన్ని ఆస్పత్రులు, ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలు, సినిమా థియేటర్లు, హోటళ్లలోనూ అదే పరిస్థితి. అగ్నిమాపక శకటం, అంబులెన్సు తిరిగే వీలు లేకుండా భవనాలను దగ్గరగా నిర్మించారు.
అవగాహన కల్పిస్తున్నాం: నాగార్జున, అగ్నిమాపక శాఖ అధికారి
ప్రతి శుక్రవారం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు, ప్రాణ నష్టం జరగకుండా చేపట్టే చర్యలపై వివరిస్తున్నాం. ప్రమాదం జరిగినవెంటనే చరవాణి నంబరు 87126 99357కు సమాచారం ఇవ్వాలి.
జిల్లా కేంద్రంలోనూ..
వికారాబాద్ పట్టణంలో 12వేల గృహాలు, 1500 దాకా వ్యాపార సముదాయాలున్నాయి. నిబంధనలు ఎవరూ పాటించటం లేదు.ఆలంపల్లి రోడ్డు పాత గంజ్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. దుకాణాలు ఇరుకుగా ఉన్నాయి. ప్రమాదం జరిగితే అక్కడికి అగ్ని మాపక శకటం, అంబులెన్సు వెళ్లటానికి వీలు లేకుండా ఉంది. కొన్ని భవనాలకు సెల్లార్లు ఉన్నాయి. దుకాణాల ముందు పార్కింగ్ స్థలాలు లేవు.
అమలయ్యేలా చూస్తున్నాం: వెంకటరమణారెడ్డి, వికారాబాద్
ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. వ్యాపార సమూదాయాల్లో నిబంధ]నలు అమలు అయ్యేలా చూస్తున్నాం. ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చరవాణి నంబరు 87126 99354కు సమాచారం ఇస్తే సత్వరం స్పందిస్తాం.
నామమాత్రపు చర్యలు
పరిగి బీజాపూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. 8వేల దాకా నివాస గృహాలు ఉంటాయి. 600కు పైగా దుకాణాల సమూదాయాలున్నాయి. ఆస్పత్రులు ఏర్పాటువుతున్నా రక్షణ చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. ఇరుకైన ప్రాంతాల్లోనూ బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రమాదవశాత్తు ప్రమాదాలు చోటు చేసుకుంటే వాహనాలు అక్కడికి వెళ్లటం కష్ట తరమే. నిబంధనలు పాటించే విధంగా చర్యలు చేపడితే మేలు.
పర్యవేక్షణ పెంచుతాం చంద్రమోహన్, పరిగి
గతంలో అనుమతులు ఉన్న భవనాలకు రెన్యూవల్స్ చేయించుకోవటానికి సమాచారం ఇస్తున్నాం. కొత్త నిర్మాణాలకు మాత్రం టీఎస్బీపాస్ ద్వారా అనుమతులు తీసుకుంటున్నారు. పాత వాటిపై పర్యవేక్షణ పెంచుతాం. చరవాణి నంబరు 95429 33449కు సమాచారం ఇవ్వాలి.
స్థలాలు లేక
కొడంగల్లో మొత్తం 3,321 నివాస గృహాలు, 80 వరకు వ్యాపార భవనాలున్నాయి. హోటళ్లు, పాఠశాలలు, దుకాణ సముదాయాల్లో నిబంధనలు పాటించటం లేదు. పరికరాలు కొన్ని చోట్ల ఉన్నాయి. భవనాల సెల్లార్లు ఖాళీగా ఉన్నాయి. దుకాణాల ముందు పార్కింగ్ స్థలాలు లేవు.
జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నాం
పవన్కుమార్, కొడంగల్
పట్టణ ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తున్నాం. ప్రయాణ ప్రాంగణాలు, సినిమా థియేటర్లు, పాఠశాలలు వంటి ప్రాంతాల్లో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాం. చరవాణి నంబరు 98665 51881కు సమాచారం ఇవ్వాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
నేతలు రోడ్డెక్క.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇంధనం ఏదమ్మాఝ
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా