IT Jobs: కొలువులు తగ్గాయ్.. కోతలు పెరిగాయ్
ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోతలు గుబులురేపుతోంది. కొవిడ్ సమయంలో ఐటీ సేవలకు డిమాండ్ పెరగడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. భారీ ప్యాకేజీలను ఆఫర్ చేశాయి.
నగరంలోని ఐటీ ఉద్యోగుల్లో గుబులు
కాంట్రాక్ట్ సిబ్బందిపై లేఆఫ్ల ప్రభావం
- ఈనాడు, హైదరాబాద్
ఐటీ సంస్థల్లో ఉద్యోగాల కోతలు గుబులురేపుతోంది. కొవిడ్ సమయంలో ఐటీ సేవలకు డిమాండ్ పెరగడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్నాయి. భారీ ప్యాకేజీలను ఆఫర్ చేశాయి. దాదాపు రెండేళ్లపాటూ ఐటీ బూమ్ నడిచింది. ఇప్పుడు పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికా, యూరోప్లో ఆర్థిక మందగమన భయాలతో ఐటీ సంస్థలు ఉద్యోగాల్లో కోతలు పెడుతున్నాయి. ఈ పరిణామాలు నగరంలోని ఐటీ ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
కొత్త ప్రాజెక్ట్లు తగ్గిపోవడంతో..
ఐటీ ఉద్యోగాల్లోనూ పలు రకాల నియామకాలు ఉన్నాయి. నేరుగా కంపెనీ పే రోల్స్పై పనిచేస్తున్న ఉద్యోగులు కొందరైతే.. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నిర్ణీత ప్రాజెక్ట్ కోసం పనిచేసేవారు మరికొందరు. లేఆఫ్ ప్రభావం ఎక్కువగా కాంట్రాక్ట్ ఐటీ ఉద్యోగులపై ఉంది. కొత్త ప్రాజెక్ట్లు తగ్గిపోవడంతో వీరి కొలువులు ఊడుతున్నాయి. అయితే ఈ ప్రభావం ఇంకా హైదరాబాద్లో లేదని.. ఉద్యోగాలు కోల్పోయిన దాఖలాలు ఇప్పటివరకు కన్పించలేదని ఒక ఐటీ సంస్థలో పేరోల్ విభాగంలో పనిచేసే ప్రతినిధి ‘ఈనాడు’తో అన్నారు.
బహుళజాతి సంస్థలైన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, గూగుల్, దేశీయ సంస్థలు విప్రో, స్విగ్గీ తదితర కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీరికున్న కార్యాలయాల్లో 5 శాతం దాకా ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ఈ సంస్థలకు అమెరికా బయట ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నది హైదరాబాద్లోనే కావడంతో సహజంగానే కోతల ప్రభావం ఉంటుందని కలవరపడుతున్నారు.
ఉన్నవారితోనే సర్దుబాటు..
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం వరకు కూడా నియామకాల్లో వృద్ధి కన్పించినా.. ఆ తర్వాత క్రమంగా కంపెనీలు కొత్త నియామకాలను పూర్తిగా ఆపేశాయ్. ఉన్న ఉద్యోగులనే సర్దుబాటు చేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం క్రమంగా ఎత్తేస్తున్నాయి. ‘ ఓ కంపెనీ నచ్చి ఉద్యోగానికి సరే అన్నాను. కానీ వారు బెంగళూరులో పనిచేయాలంటున్నారు. దీంతో వదులుకున్నాను. బయట పరిస్థితులు చూస్తుంటే కొంత ఆందోళనగా ఉంది’ అని ఐటీ రంగంలోని ఉన్నత ఉద్యోగి ఎస్.కె.గాంధీ అన్నారు.
తాత్కాలికమే..
ఓరుగంటి వెంకట్, అధ్యక్షుడు, కొంపల్లి ఐటీ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్
అంతర్జాతీయంగా లేఆఫ్ల ప్రభావం మనమీద కన్పించినా అది తాత్కాలికమే. దీర్ఘకాలికంగా ఇది మనకు మేలు చేస్తుంది. యూకే, యూఎస్లో రెండు ఉద్యోగాలు తీసేస్తే.. ఇక్కడ నాలుగు ఉద్యోగాలు వస్తాయి. కొత్తవారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. టాప్ లెవల్లో ఉండే ఉద్యోగుల వేతనాలు ఎక్కువ కాబట్టి వీరి ఉద్యోగాలు కొన్ని పోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అక్కడ వచ్చింది కూడా సాఫ్ట్ క్రైసిస్ కాబట్టి మనపై ఎక్కువ ప్రభావం ఉండదు. దావోస్లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. మారుతున్న టెక్నాలజీలకు తగ్గట్టుగా నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు