ముట్టడిని విజయవంతం చేయండి: ఆర్.కృష్ణయ్య
పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు విడుదల చేసి, పూర్తి ఫీజులు మంజూరు చేయాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బాగ్లింగంపల్లి, న్యూస్టుడే: పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఉపకార వేతనాలు విడుదల చేసి, పూర్తి ఫీజులు మంజూరు చేయాలని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం సుందరయ్య కళానిలయంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 24న నిర్వహించనున్న కలెక్టరేట్ల ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాలను కూడా ముట్టడించాలన్నారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Supreme court: ఎఫ్డీలను జప్తు చేశారో? లేదో? వివరాలివ్వండి: భారతీ సిమెంట్స్కు సుప్రీం ఆదేశం
-
Sports News
Ind vs Aus: టీమ్ ఇండియా 36కి ఆలౌట్.. ఆ పరాభవానికి బదులు తీర్చుకోవాల్సిందే!
-
Crime News
Crime news: ఇద్దరు కుమారులకు ఉరివేసి.. తల్లి బలవన్మరణం
-
Movies News
Anupam Kher: టాలెంట్ కంటే హెయిర్ స్టైల్ ముఖ్యమని అప్పుడర్థమైంది: అనుపమ్
-
India News
Pariksha Pe Charcha: ‘పరీక్షా పే చర్చ’.. గత ఐదేళ్లలో చేసిన ఖర్చెంతంటే?
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!