logo

Hyderabad: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌తో అప్పులపాలై.. యువ ఇంజినీర్ బలవన్మరణం

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... చంపాపేట్‌ సాయిరాంనగర్‌లో నివాసం ఉండే బి.మోహన్‌ కృష్ణ(24) ఓ సంస్థలో అసిస్టెంట్‌ సిస్టం ఇంజనీర్‌.

Updated : 24 Jan 2023 08:44 IST

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం... చంపాపేట్‌ సాయిరాంనగర్‌లో నివాసం ఉండే బి.మోహన్‌ కృష్ణ(24) ఓ సంస్థలో అసిస్టెంట్‌ సిస్టం ఇంజనీర్‌. తండ్రి మూడేళ్ల క్రితమే చనిపోవడంతో తల్లి, అన్నయ్య, వదినలతో కలిసి ఉంటున్నాడు. కొంతకాలంగా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడి అందుకు అప్పులు చేశాడు. ఇంటివద్ద నుంచే పని చేస్తున్న అతడు.. ఆదివారం ఉదయం బయటకు వెళ్లాడు. సోమవారం ఉదయం బొల్లారంబజార్‌- అల్వాల్‌ రైల్వేస్టేషన్ల మధ్య ఓ యువకుడు మృతదేహం రైలు పట్టాలపై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద లభ్యమైన సెల్‌ఫోన్‌ ఆధారంగా మోహన్‌కృష్ణగా తేల్చారు. కుటుంబసభ్యుల ద్వారా ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని