అటు లేజర్ షో.. ఇటు ఫార్ములా-ఈ రేస్
హస్సేన్సాగర్ తీరాన ఫార్ములా-ఈ రేస్ అంతర్జాతీయ పోటీలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్, పీపుల్స్ ప్లాజా, సచివాలయం, మింట్కాంపౌండ్, ఐమాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ను తీర్చిదిద్దారు.
శరవేగంగా కొనసాగుతున్న ఏర్పాట్లు
మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్ షో కోసం జరుగుతున్న పనులు
ఈనాడు, హైదరాబాద్: హస్సేన్సాగర్ తీరాన ఫార్ములా-ఈ రేస్ అంతర్జాతీయ పోటీలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ గార్డెన్, పీపుల్స్ ప్లాజా, సచివాలయం, మింట్కాంపౌండ్, ఐమాక్స్ మీదుగా 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్ను తీర్చిదిద్దారు. ఫిబ్రవరి 11న జరగనున్న పోటీలను దృష్టిలో పెట్టుకొని ఈ రహదారికి తుది మెరుగులు దిద్దుతున్నారు. పక్కన బారికేడ్లకు రంగులు అద్దుతున్నారు. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రికల్ కార్లు ఈ రేసులో పాల్గొననున్నాయి. 22 మంది డ్రైవర్లు తమ సత్తా చాటనున్నారు. వారం రోజుల ముందు నుంచే ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయి. స్ట్రీట్ సర్క్యూట్కు ఇరువైపులా భారీ ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఐమాక్స్ పక్కన కార్ల షెడ్లుతోపాటు వీఐపీల గ్యాలరీల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
రేసింగ్కు సిద్ధమైన రహదారి
ఒకట్రెండు రోజుల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి. ఇప్పటికే బుక్మై షోలో వీటికి సంబంధించి టికెట్లు అమ్మకానికి పెట్టారు. కాగా పోటీలకు తరలి వచ్చే దేశ, విదేశీ పర్యాటకుల కోసం హుస్సేన్సాగర్ చుట్టూ సరికొత్త హంగులు తీసుకొస్తున్నారు. హుస్సేన్సాగర్ లోపల రూ.7 కోట్లతో నీటిపై తేలే మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్షో ఏర్పాటు చేస్తున్నారు. వీటికి సంబంధించి పనులు కూడా కొలిక్కి వచ్చాయి. పోటీలు జరిగే తేదీకు నాలుగైదు రోజుల ముందే ఇవి ప్రారంభం కానున్నాయి. లేజర్షోలో హైదరాబాద్ సంస్కృతి సంప్రదాయాలు తెలిపే ఘట్టాలను ప్రదర్శించనున్నారు. పర్యాటక శాఖ నడిపే పడవల్లో వెళ్లి తిలకించే అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాక రోడ్డుపై నిలబడి పర్యాటకులు ఉచితంగానే ఈ షోను వీక్షించవచ్చు. సాయంత్రం 7 నుంచి రాత్రి 9 వరకు ప్రదర్శిస్తారు. ఫార్ములా-ఈ రేస్ తర్వాత కూడా మ్యూజికల్ ఫౌంటెయిన్, లేజర్షో కొనసాగనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
KCR: నాగలి పట్టే చేతులు..శాసనాలు చేయాలి: కేసీఆర్
-
Movies News
Thaman: నెగెటివిటీపై తమన్ స్ట్రాంగ్ కౌంటర్
-
Sports News
Asia Cup 2023: ఆసియా కప్ 2023.. రమీజ్ అప్పటి వ్యాఖ్యలు.. ఇప్పుడు నజామ్ మాటల్లో..!
-
General News
పెదపారుపూడిలో రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవనాలు.. ప్రారంభించిన శైలజాకిరణ్
-
Sports News
Shaheen Afridi: దయ చేసి.. ఇలాంటి జ్ఞాపకాలను నాశనం చేయొద్దు: షాహీన్
-
Movies News
Bhanupriya: జ్ఞాపకశక్తి తగ్గడంతో.. సెట్కు వెళ్లి డైలాగ్స్ మర్చిపోయా: భానుప్రియ