పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు: మంత్రి సబిత
రాష్ట్రంలో 10వేల మంది ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అక్రమాలకు తావులేకుండా ఆన్లైన్లో పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.
ఎల్లమ్మ ఆలయం వద్ద కుటుంబ సభ్యులతో మంత్రి సబిత
తాండూరు గ్రామీణ: రాష్ట్రంలో 10వేల మంది ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అక్రమాలకు తావులేకుండా ఆన్లైన్లో పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. మండలంలోని మంత్రి స్వగ్రామం కోటబాస్పల్లి మంగళవారం జరిగిన ఎల్లమ్మ తల్లి పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.
బండి సంజయ్కి తగదు..: భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. ఆయన కుమారుడు ర్యాగింగ్కు పాల్పడటంతో చట్టం ప్రకారం కేసు నమోదు చేస్తే ముఖ్యమంత్రి కేసు పెట్టించారని ఆరోపించడం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. భార్యా భర్తల బదిలీల విషయంలోనూ రాజకీయ ఆరోపణలు చేయడం తగదన్నారు.
* వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచే పోటీ చేస్తానని, వికారాబాద్ జిల్లాలో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తాండూరు నియోజకవర్గంలో వర్గపోరును వారే దిద్దుకుంటారంటూనే, తమ మధ్య ఎలాంటి వర్గపోరు లేదని అందరం ఒకే పార్టీలో కొనసాగుతున్నట్లు వెల్లడించారు. సిటీ కేబుల్ ఎండీ నర్సింహారెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మన్ లక్ష్మారెడ్డి, భారాస పట్టణ, మండలాధ్యక్షులు అప్పూ, రాందాస్ ఉన్నారు.
సంతోషం కంటే బాధే ఎక్కువ
తన సొంతూరు కోటబాస్పల్లికి వస్తే సంతోషం కంటే బాధే ఎక్కువగా ఉంటుందని మంత్రి సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్వగ్రామానికి వస్తే తల్లిదండ్రులు గొట్టిగ మహిపాల్రెడ్డి, వెంకటమ్మలు గుర్తుకొస్తారని, వారు లేనందున తరచూ రాలేకపోతున్నట్లు తెలిపారు. అంతకు ముందు ఎల్లమ్మ ఆలయానికి చేరుకొన్న మంత్రి తన సోదరుడు, సిటీ కేబుల్ ఎండీ నర్సింహారెడ్డి, సుశ్మితా రెడ్డిలతోపాటు కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు చేశారు.
* ఆమెను పీఆర్టీయూ జిల్లా, మండల ప్రతినిధులు నాగప్ప, నర్సిరెడ్డి, కిష్టప్ప, వెంకట్రాంరెడ్డి, శశిధర్, శ్రీనివాస్, వెంకట్రెడ్డి, మల్రెడ్డి తదితరులు కలిసి బదిలీలపై కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!