విధుల్లో ఉత్తములు.. సేవలకు పతకాలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన ‘ఉత్తమ సేవా’ పతకాలకు నగరం నుంచి ముగ్గురు అధికారులు ఎంపికయ్యారు.
మూడు కమిషనరేట్లలో ముగ్గురు పోలీసు అధికారులకు గుర్తింపు
ఈనాడు, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన ‘ఉత్తమ సేవా’ పతకాలకు నగరం నుంచి ముగ్గురు అధికారులు ఎంపికయ్యారు. మూడు కమిషనరేట్ల నుంచి ఒక్కొక్కరికి ఈ పతకాలు దక్కడం విశేషం. హైదరాబాద్ నగర సంయుక్త కమిషనర్ పెర్ల విశ్వప్రసాద్, సైబరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ గంగసాని శ్రీధర్, రాచకొండ ఐటీ సెల్ ఇన్ఛార్జి మామిళ్ల శ్రీధర్రెడ్డి ఎంపికయ్యారు. వృత్తిలో ఉత్తమ పనితీరు కనబర్చినందుకు కేంద్ర హోం శాఖ ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తోంది.
పి.విశ్వప్రసాద్
హైదరాబాద్ సంయుక్త కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్)
ప్రస్తుతం హైదరాబాద్ సంయుక్త కమిషనర్(స్పెషల్ బ్రాంచ్) బాధ్యతల్లో ఉన్న విశ్వప్రసాద్కు మెట్రో పోలీసింగ్లో సుదీర్ఘ అనుభవం ఉంది. గతంలో ఎల్బీనగర్, మాదాపూర్, సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేశారు. మహబూబ్నగర్, నిజామాబాద్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. స్పెషల్ బ్రాంచ్ సంయుక్త కమిషనర్గా అసాంఘిక శక్తులు, ఉగ్ర కార్యకలాపాలను అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. పలు రివార్డులు అందుకున్నారు.
గంగసాని శ్రీధర్
ఏసీపీ. సైబరాబాద్ సైబర్ క్రైం
ఎస్సైగా 1991లో బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ 1993లో నగరంలో వరుస బాంబు పేలుళ్లకు కుట్రపన్నిన ఇఖ్వాన్ ఉల్ ముస్లిమీన్(ఐయూఎం)కు చెందిన నిసార్ అహ్మద్ భట్, గౌర్ అమీన్మీర్ను అదుపులోకి తీసుకున్న సిట్లో కీలకంగా వ్యవహరించారు. 2007లో కౌంటర్ ఇంటెలిజెన్స్లో పనిచేసినప్పుడు ఖమ్మం, జహీరాబాద్లో ఉగ్రవాదుల అరెస్టు, తీవ్రవాదులకు శిక్షణనిచ్చిన సత్తార్ను అదుపులోకి తీసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. 177 రివార్డులు దక్కాయి.
మామిళ్ల శ్రీధర్రెడ్డి
ఐటీ సెల్ ఇన్ఛార్జి, రాచకొండ
ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి 1998 బ్యాచ్ ఎస్సై. నల్గొండ జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశారు. సంచలనం సృష్టించిన హాజీపూర్ కేసులో సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల్ని అదుపులోకి తీసుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. 2018 నుంచి ఐటీ విభాగం ఇన్ఛార్జ్గా ఉన్నారు. 2009లో సేవా పతకం, 2015లో రాష్ట్ర శౌర్య పతకం, 2019లో ముఖ్యమంత్రి సర్వోన్నత పతకం అందుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!