logo

చెలరేగిన గొలుసు దొంగలు

గొలుసు దొంగలు విజృంభించారు. చందానగర్‌ ఠాణా పరిధిలో బుధవారం అరగంట వ్యవధిలోనే రెండు చోట్ల పంజా విసిరారు.

Published : 26 Jan 2023 04:23 IST

చందానగర్‌ ఠాణా పరిధిలో రెండు ప్రాంతాల్లో పంజా

ద్విచక్ర వాహనంపై వెళుతున్న దుండగులు(సీసీ కెమెరా చిత్రం)

శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే: గొలుసు దొంగలు విజృంభించారు. చందానగర్‌ ఠాణా పరిధిలో బుధవారం అరగంట వ్యవధిలోనే రెండు చోట్ల పంజా విసిరారు. సీఐ కాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం.. రైల్‌విహార్‌ ప్రాంతానికి చెందిన రాజశ్రీ(40) గృహిణి. మధ్యాహ్నం 2.20 గంటలకు కూరగాయల మార్కెట్‌కు వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని యువకులు ద్విచక్రవాహనంపై దూసుకొచ్చారు. ఆమె మెడలోని పుస్తెల తాడును లాగారు. దొంగల చేతిలోకి పుస్తెలు వెళ్లగా.. బంగారు గొలుసు మాత్రం ఆమె చేతిలోనే ఉండిపోయింది. సురక్ష కాలనీకి చెందిన లక్ష్మి(31) ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. స్థానిక అపర్ణ హిల్‌పార్క్‌ ప్రాంతంలో పని ముగించుకొని ఇంటికి వస్తున్న క్రమంలో.. ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల పుస్తెల తాడును లాక్కొని ఉడాయించారు. ఈ ఘటన 2.40 ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు తేల్చారు. రెండు ఘటనలు ఒకే ముఠా పనిగా నిర్ధారణకు వచ్చారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని