లారీ ఢీకొని ట్రాఫిక్ హోంగార్డు దుర్మరణం
విధి నిర్వహణలో భాగంగా వాహన తనిఖీలు చేపడుతున్న ట్రాఫిక్ హోంగార్డును లారీ ఢీకొట్టడంతో మృతి చెందాడు.
శ్రీనివాస్
మేడ్చల్: విధి నిర్వహణలో భాగంగా వాహన తనిఖీలు చేపడుతున్న ట్రాఫిక్ హోంగార్డును లారీ ఢీకొట్టడంతో మృతి చెందాడు. మేడ్చల్ సీఐ రాజశేఖర్రెడ్డి, ట్రాఫిక్ సీఐ నర్సింహారెడ్డి వివరాల ప్రకారం..వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చాపలగూడెంకు చెందిన జి.శ్రీనివాస్(33) మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో ట్రాఫిక్ హోంగార్డుగా పనిచేస్తున్నారు. జాతీయ రహదారి 44పై కండ్లకోయ వద్ద బుధవారం మధ్యాహ్నం తనిఖీలు చేస్తుండగా.. ఓఆర్ఆర్ వైపు వెళ్తున్న ఓ లారీ ఢీకొట్టింది. శ్రీనివాస్ శరీరం పైనుంచి వెనుక చక్రాలు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందాడు. డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడ్చల్లో అద్దెకుంటున్న శ్రీనివాస్కు భార్య, కుమారుడు(6), కూతురు(4) ఉన్నారు. పుట్టుకతోనే కుమార్తెకు అనారోగ్యం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం