logo

సహజీవనం చేస్తున్న మహిళ హత్య

సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి అనుమానంతో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. బాలానగర్‌ సీఐ కె.భాస్కర్‌ కథనం ప్రకారం..

Updated : 26 Jan 2023 05:43 IST

బాలానగర్‌: సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి అనుమానంతో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. బాలానగర్‌ సీఐ కె.భాస్కర్‌ కథనం ప్రకారం.. మిర్యాలగూడ సుందర్‌నగర్‌కు చెందిన కూలి పనిచేసుకునే పి.శారద (28)ను భర్త వదిలేయడంతో అదే ప్రాంతానికి చెందిన గుడిసె హరికృష్ణ (30)తో పరిచయం ఏర్పడింది. 7 మాసాల క్రితం ఇద్దరూ బాలానగర్‌ అంబికాకాలనీలో సహజీవనం చేస్తున్నారు. ఇటీవల శారదపై హరికృష్ణకు అనుమానం వచ్చి పెనుభూతంలా మారడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. తరచూ ఇద్దరూ గొడవ పడుతుండేవారు. బుధవారం గొడవపడిన హరికృష్ణ కత్తితో శారద గొంతు కోసి హత్య చేశాడు. చనిపోయిందని ధ్రువీకరించుకున్న తర్వాత ఇంటి తలుపు వేసి పరారయ్యాడు. హరికృష్ణ నేరుగా మిర్యాలగూడ ఠాణాలో లొంగిపోయినట్లు సమాచారం. అక్కడి పోలీసుల సమాచారం మేరకు బాలానగర్‌ పోలీసులు సదరు ఇంటికెళ్లి చూడగా శారద రక్తపు మడుగులో పడి ఉంది. హత్య సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగినట్లు గదిలో చిందరవందరగా పడి ఉన్న సామాన్లనుబట్టి అర్థమవుతుంది. శారద ఉదయం నుంచి కనిపించకపోవడంతో ఇంటి యజమాని పరిశీలించి తమకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి చూడగా హత్య గురైందని సీఐ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని