Kavitha: సీఎం కేసీఆర్‌ విజన్‌ ప్రతిబింబించేలా ప్రసంగించిన గవర్నర్‌కు థ్యాంక్స్‌: కవిత

రిపబ్లిక్‌ డే సందర్భంగా గవర్నర్‌ తమిళిసై చేసిన ప్రసంగంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విటర్‌ వేదికగా స్పందించారు. గవర్నర్‌కు ధన్యవాదాలంటూ ట్వీట్‌ చేశారు.

Updated : 26 Jan 2023 16:11 IST

హైదరాబాద్‌: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై ప్రసంగంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు గవర్నర్‌ ప్రసంగంలోని కొంత భాగాన్ని  ఆమె ట్విటర్‌లో షేర్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ విజన్‌ను ప్రతిబింబించేలా ప్రసంగించినందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు అంటూ ట్వీట్‌ చేశారు. ‘‘సీఎం కేసీఆర్‌ ప్రశ్నించిన వాటినే మళ్లీ అడిగినందుకు గవర్నర్‌కు థ్యాంక్స్‌. దేశంలోని మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని గతంలోనే డిమాండ్‌ చేశాం. కరోనా క్లిష్ట సమయంలో సెంట్రల్‌విస్టా కంటే మౌలిక సదుపాయాలు ముఖ్యమని చెప్పాం. కొందరి సంపద పెంపుపై మాత్రమే దృష్టి పెట్టొద్దని.. రైతులు, కూలీలు, నిరుద్యోగులను పట్టించుకోవాలని పోరాడాం’’ అని కవిత ట్వీట్‌ చేశారు. దేశంలో భిన్నత్వాన్ని రాజ్యాంగం ప్రతిబింబిస్తోందని మరో ట్వీట్‌లో కవిత పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్రతీ అంశాన్ని బలపరచడం భారతీయులందరి బాధ్యత అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని