కొడంగల్కు నీళ్లు, నిధులు
సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లకు సమానంగా కొడంగల్కి నీళ్లు, నిధులు తీసుకొస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. గురువారం ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలో భాగంగా దుద్యాల, కొడంగల్లో జరిగిన సమావేశాల్లో మాట్లాడారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
మదన్పల్లిలో మాట్లాడుతున్న రేవంత్రెడ్డి, నేతలు
బొంరాస్పేట, కొడంగల్, న్యూస్టుడే: సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లకు సమానంగా కొడంగల్కి నీళ్లు, నిధులు తీసుకొస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. గురువారం ‘హాథ్ సే హాథ్ జోడో’ యాత్రలో భాగంగా దుద్యాల, కొడంగల్లో జరిగిన సమావేశాల్లో మాట్లాడారు. కేసీఆర్ తనపై కక్షగట్టి కొడంగల్లో ఓడిస్తే... మల్కాజిగిరి ఎంపీగా గెలిచి పార్లమెంట్కు వెళ్లానని.. మళ్లీ జాతీయపార్టీ రాష్ట్ర పగ్గాలు పట్టానని అన్నారు. నియోజకవర్గాన్ని కేటీఆర్ దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించి నాలుగేళ్లయినా.. అభివృద్ధి పనులు చేపట్టలేదని దుయ్యబట్టారు. కొత్త జిల్లాల పేరుతో కొడంగల్ను మూడు ముక్కలు చేశారని విమర్శించారు. కొడంగల్లో భారాస గెలిస్తే.. రెండేళ్లల్లోనే సాగుకు కృష్ణా జలాలు తెస్తామన్నారు. కానీ ఆ పనులు కాలేదన్నారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం మంజూరు జీవో 69ని, కృష్ణా- వికారాబాద్ రైల్వేలైన్ పనులకు రూ.350 కోట్ల నిధులు తానే తీసుకొస్తే ఇప్పటకీ పనులను చేపట్టలేదన్నారు. నియోజకవర్గంలో రెండుపడక గదుల నిర్మాణాలు ఎక్కడున్నాయో చూపిస్తే.. ఆ గ్రామంలో కాంగ్రెస్ ఓట్లు అడగదని లేకుంటే.. ఇక్కడి ప్రజలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలిపిస్తే.. ఇక్కడి ప్రాంతం అభివృద్ధికి నిధులు, నీళ్లు తీసుకువస్తానన్నారు. రాష్ట్రంలోనే కొడంగల్ను నమూనాగా అభివృద్ధి చేసుకుందామని.. అందుకు ముఖ్యనాయకులు కష్టపడి పని చేయాలని కోరారు.
ప్రతి గింజను కొంటాం..
బొంరాస్పేట సమీపంలోని వేరుశనగ చేలల్లో పనిచేస్తున్న కూలీల్ని రేవంత్రెడ్డి పలుకరించారు. వారు ఆయనతో మాట్లాడుతూ.. వేరుశనగ దిగుబడి తగ్గిందని గిట్టుబాటు ధర క్వింటాలుకు రూ.12వేలు కల్పిస్తే మేలని అన్నారు. మరికొందరు తమకు సర్కారు అందించే ఇల్లు, రేషన్కార్డులు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ఆయన కూలీలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు ప్రశాంత్, నర్సింహులుగౌడ్, వెంకట్రాములుగౌడ్, రాంచంద్రారెడ్డి, వెంకటయ్య, అంజిల్రెడ్డి, నర్సింహులునాయుడు, జయకృష్ణ, మల్లేశ్ ఉన్నారు.
విజయవంతం చేయాలి: టీఆర్ఆర్
దోమ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించి అనవసర విషయాలను చర్చకు తీసుకొస్తూ సమస్యలు సృష్టిస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు తమ్మన్నగారి రాంమ్మోహన్రెడ్డి (టీఆర్ఆర్) అన్నారు. గురువారం దోమ మండలం మైలారంలో శ్రీనివాసుని సన్నిధిలో పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్గాంధీకి మద్దతుగా చేపట్టిన జోడో యాత్ర కరపత్రాలను ఇంటింటా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ చేసిన కృషిని గుర్తించేలా అవగాహన కల్పించాలన్నారు. పార్టీ దోమ మండల అధ్యక్షుడు విజయ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
[ 19-04-2024]
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
[ 19-04-2024]
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు