హెచ్సీయూలో ప్రదర్శనల దుమారం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శనల దుమారం కొనసాగుతోంది. ఇండియా- ది మోదీ క్వశ్చన్ పేరిట బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని నాలుగురోజుల క్రితం ఓ విద్యార్థిసంఘం ఆధ్వర్యంలో క్యాంపస్లో ప్రదర్శించారు.
విద్యార్థి సంఘాల పోటాపోటీ ఆందోళన
వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులు
గచ్చిబౌలి, న్యూస్టుడే: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో డాక్యుమెంటరీ ప్రదర్శనల దుమారం కొనసాగుతోంది. ఇండియా- ది మోదీ క్వశ్చన్ పేరిట బీబీసీ రూపొందించిన వివాదాస్పద డాక్యుమెంటరీని నాలుగురోజుల క్రితం ఓ విద్యార్థిసంఘం ఆధ్వర్యంలో క్యాంపస్లో ప్రదర్శించారు. దీనిపై మరో విద్యార్థి సంఘం వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయమై అంతర్గత విచారణకు ఆదేశించారు. తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏబీవీపీ ఆధ్వర్యంలో నార్త్క్యాంపస్ షాపింగ్ కాంప్లెక్స్ అంబేడ్కర్ చౌక్వద్ద గురువారం సాయంత్రం ‘కశ్మీర్ఫైల్స్’ సినిమా ప్రదర్శించేందుకు నిర్ణయించారు. అదే సమయంలో అక్కడే ఎస్ఎఫ్ఐవారు బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శించేందుకు నిర్ణయించారు. రెండు సంఘాలు పోటాపోటీగా ఏర్పాట్లు చేసుకున్నాయి. గురువారం సా.6 గంటల ప్రాంతంలో ఏబీవీపీ విద్యార్థులు చిత్ర ప్రదర్శనకు అవసరమైన ప్రొజెక్టర్, తెరను అద్దెకు తీసుకొని వస్తుండగా సెక్యూరిటీ సిబ్బంది మెయిన్గేటువద్ద అడ్డుకున్నారు. విద్యార్థుల నుంచి ప్రొజెక్టర్, తెరను లాక్కున్నారు. ఇరువురి మధ్య తోపులాట జరిగింది. అనంతరం విద్యార్థులు ప్రధానగేటు బయట బైఠాయించారు. కశ్మీర్ఫైల్స్ చిత్ర ప్రదర్శన అడ్డుకుని, బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు మాత్రం భద్రత కల్పించడం శోచనీయమని ఏబీవీపీ విద్యార్థి నాయకుడు మహేశ్ మండిపడ్డారు. అనంతరం మరో ప్రొజెక్టర్, తెర తెప్పించి కశ్మీర్ఫైల్స్ సినిమాను నార్త్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఏబీవీపీ ప్రదర్శించింది. ఎస్ఎఫ్ఐవారు బీబీసీ డాక్యుమెంటరీ పార్ట్-1, పార్ట్-2ను ప్రదర్శించారు. వర్సిటీలో చిత్రాలను, డాక్యుమెంటరీలను ప్రదర్శించాలంటే స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఇటీవల రిజిస్ట్రార్ దేవేశ్ నిగమ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. గురువారం చేసిన చిత్రాల ప్రదర్శనకు వర్సిటీ అనుమతి విషయమై అధికారులు ప్రకటన చేయలేదు. తమకు ఫిర్యాదూ అందలేదని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో విద్యార్థి బృందాలకు డీన్ స్టూడెంట్స్ వెల్ఫేర్ కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతల సమస్యల నేపథ్యంలో క్యాంపస్లో సినిమాలు ప్రదర్శించవద్దన్నారు. త్వరలో జరిగే సెమిస్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించినట్లు ఆయన వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు