పచ్చపచ్చగ.. నగరం మెచ్చగ
భావితరాలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, ఆహ్లాదకరమైన వాతావరణమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి ప్రారంభించారు.
మొక్కలను పరిశీలిస్తున్న మంత్రి తలసాని
ఖైరతాబాద్: భావితరాలకు మనం ఇవ్వాల్సింది ఆస్తులు కాదని, ఆహ్లాదకరమైన వాతావరణమని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గురువారం పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన గ్రాండ్ నర్సరీ మేళాను మంత్రి ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మొక్కలతో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం హరితహారం చేపట్టి ఏటా కోట్లాది మొక్కలను నాటుతున్న విషయాన్ని గుర్తుచేశారు. మేళాలో అరుదైన మొక్కలతోపాటు పరికరాలు, కుండీలు, ఎరువులను ఆయా సంస్థలు ఏర్పాటుచేశాయి. నగరవాసులు ఈ మేళాను సందర్శించాలని మంత్రి సూచించారు.నిర్వాహకులను అభినందించారు. నిర్వాహకులు ఖాలిద్ అహ్మద్ మాట్లాడుతూ ప్రదర్శన ఈనెల 30వరకు రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుందన్నారు.
మేళాకు విచ్చేసి సెల్ఫీ దిగుతున్న సందర్శకులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amritpal Singh: విదేశాల నుంచి రూ.35 కోట్లు.. పాక్కు కాల్స్..!
-
India News
CUET-PG 2023: సీయూఈటీ -పీజీ పరీక్ష షెడ్యూల్ ఇదే.. UGC ఛైర్మన్ ట్వీట్!
-
General News
Viveka Murder Case: వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
General News
KTR: పంట నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వాలి: పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
-
Sports News
GGT vs UPW: ఆష్లీన్, హేమలత హాఫ్ సెంచరీలు.. యూపీ ముందు భారీ లక్ష్యం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు