అభినయ కౌశలం..ఆత్మీయ బంధం
కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న అలనాటి సినీ నటి జమున మరణవార్త విని ఫిలింనగర్ బోరుమంది. తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది
రవీంద్రభారతి, ఫిలింనగర్ న్యూస్టుడే: కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న అలనాటి సినీ నటి జమున మరణవార్త విని ఫిలింనగర్ బోరుమంది. తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. బంజారాహిల్స్లోని ఆమె ఇంటికి, ఫిలింనగర్లోని ఫిల్మ్ఛాంబర్ ప్రాంగణానికి పలువురు సినీ రంగ ప్రముఖులతో పాటు సామాన్యులు, సినీ కార్మికులు భారీగా తరలివచ్చి జమున పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆమె నటించిన చిత్రాలు చిరకాలం చెరగని గురుతులుగా నిలిచిపోతాయని కొనియాడారు. ఫిలింనగర్తో జమునకు విడదీయలేని అనుబంధం ఉంది. ఫిల్మ్ఛాంబర్లో జరిగే అనేక సినీ కార్యక్రమాల్లో తరచూ ఆమె పాల్గొనేవారు. తెలుగు చిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలివచ్చిన తర్వాత సినీ రంగ ప్రముఖులు ఫిలింనగర్లోనే నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. రామానాయుడు, పద్మాలయ స్టూడియోలు సైతం ఇక్కడే ఉండేవి. దీంతో ఇక్కడి వారితో ఆమెకు విడదీయరాని అనుబంధం ఏర్పడింది. జమున కూతురు స్రవంతి చిత్రకారిణి. బంజారాహిల్స్లో జరిగే పెయింటింగ్ ప్రదర్శనలను కూతురితో కలిసి సందర్శించేవారు. ఆమె ఇంట్లో అడుగు పెడితే.. అందర్ని ఆకట్టుకునేలా కూతురు వేసిన అందమైన పెయింటింగ్స్ దర్శనమిస్తాయి.
సాంస్కృతికోత్సవాల్లో..
అభినయకౌశలంతో ‘సత్యభామ’ను ప్రేక్షకుల కళ్లముందు సాక్షాత్కరింపజేసిన జమున అయిదారు నెలల క్రితం వరకు రవీంద్రభారతి, త్యాగరాయగానసభ, తెలుగువర్సిటీలోని ఎన్టీఆర్ ఆడిటోరియం తదితర వేదికలపై జరిగే సాంస్కృతికోత్సవాల్లో పాల్గొని అందరి హృదయాలకు హత్తుకునేలా మంచి మాటలు చెప్పేవారు. ఆడపిల్లలకైతే జాగ్రత్తలు చెప్పేవారు. జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి. ప్రస్తుత సమాజ పోడకలను గురించి చెప్పేవారు.
అప్పటికే కథానాయిక...
* మద్రాస్ నుంచి తెలుగు సినిమా కథానాయకుల్లో అక్కినేని నాగేశ్వరరావు తొలిసారిగా 1963లో హైదరాబాద్కు తరలివచ్చారు. దాదాపు పదేళ్ల తరువాత 1972లో జమున నగరానికి చేరుకున్నారు. ఆమె భర్త ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పని చేసేవారు. ఆమె హైదరాబాద్కు తరలివచ్చేనాటికే సినిమాల్లో కథానాయికగా కొనసాగుతున్నారని సినీ చరిత్రకారుడు సంగమం సంజయ్ కిషోర్ పేర్కొన్నారు. ‘చాలా మంది జమున చేతిరాత ముత్యాల్లాగా ఉంటుందని చెప్పేవారు.. ఆమె పెద్ద కథానాయిక అయినప్పటికీ సాధారణ మహిళలాగే కనిపించేవారు. చిన్న పిల్లల మనస్తత్వం’ అని వివరించారు.
పలు సత్కారాలు.
* గతేడాది వంశీ ఇంటర్నేషనల్ స్వర్ణోత్సవాల సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆమెకు వంశీ-ఆళ్ల స్వర్ణకంకణం బహూకరించారు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఆమె జన్మదినోత్సవం సందర్భంగా నటుడు గిరిబాబు, మండలి బుద్ధప్రసాద్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ప్రభాకరరావు జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, ఓలేటి పార్వతీశం ఇటీవల సన్మానించారు.
ట్రస్ట్తో సేవ..
* జమునా ఛారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి ఎంతో మందిని ఆదుకున్నారు. ‘జిక్కి’కి క్యాన్సర్ వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే.. సంగమం ద్వారా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. తనవంతుగా రూ.25 వేలు అందజేశారు.
‘జమున మృతి తీరని లోటు’
గౌతంనగర్: సినీనటి జమున మృతి కళా ప్రపంచానికి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వ సంగీత, నాటక అకాడమి సభ్యురాలు, ప్రముఖ కూచిపూడి నాట్య గురువు డాక్టర్ ఎస్పీభారతి అన్నారు. శుక్రవారం గౌతంనగర్లో ఆమె మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా జమునతో కలిసి అనేక కార్యక్రమాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్నట్లు తెలిపారు. తన పీహెచ్డీ పరిశోధనలో జమున ముఖ్య భూమిక పోషించారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్