logo

మాడ వీధుల్లో.. స్వామి వైభవం

జిల్లాలో శనివారం రథ సప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మీ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో సూర్యప్రభ, చిన్నశేష, పెద్ద శేష, హనుమంత, గరుడ, వ్యాలి, హంస, చంద్రప్రభ వాహనాలపై స్వామి వారు శ్రీదేవీ, భూదేవీ సమేతంగా బాలాజీ మాడవీధుల్లో ఊరేగారు.

Published : 29 Jan 2023 02:37 IST

కొడంగల్‌లో..

దౌల్తాబాద్‌, కొడంగల్‌, వికారాబాద్‌ గ్రామీణ: జిల్లాలో శనివారం రథ సప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. కొడంగల్‌లోని శ్రీమహాలక్ష్మీ వేెంకటేశ్వర స్వామి ఆలయంలో సూర్యప్రభ, చిన్నశేష, పెద్ద శేష, హనుమంత, గరుడ, వ్యాలి, హంస, చంద్రప్రభ వాహనాలపై స్వామి వారు శ్రీదేవీ, భూదేవీ సమేతంగా బాలాజీ మాడవీధుల్లో ఊరేగారు. స్వామి వారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇచ్చారు.

* కోరిన కోరికలు తీర్చే అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని రథసప్తమి సందర్భంగా సప్త వాహనాలపై ఘనంగా ఊరేగించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వాహన సేవ కార్యక్రమాలు కొనసాగించారు. భక్తులు పూజల్లో పాల్గొని స్వామి సేవలో తరించారు.  కార్యక్రమంలో ఆలయ ఈఓ నరేందర్‌, ఆలయ ధర్మకర్త పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.

వికారాబాద్‌లో..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని