logo

ద్విచక్రవాహనం అదుపు తప్పి.. కుక్కింద సర్పంచి మృతి

ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడి సర్పంచి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని శనివారం చోటుచేసుకుంది.

Published : 29 Jan 2023 02:37 IST

ధారూర్‌: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడి సర్పంచి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం కుక్కింద గ్రామ సర్పంచి (సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు) కారంజి వీరేశం (48) శుక్రవారం రాత్రి గ్రామం నుంచి ధారూర్‌ వెళ్తుండగా మార్గమధ]్యలో అంగడిచింతల దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే వికారాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుని కుమారుడు శశికిరణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు. మృతునికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. 

ఎమ్మెల్యే పరామర్శ

సర్పంచి వీరేశం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని