logo

సాధువు వేషంలో వచ్చి... మహిళ మంగళసూత్రం చోరీ

సాధువు వేషంలో యాచకుడిలా వచ్చిన  దుండగుడు ఓ మహిళ దృష్టి మరల్చి ఆమె మంగళసూత్రాన్ని కాజేసిన సంఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

Published : 29 Jan 2023 02:20 IST

నాగోలు, న్యూస్‌టుడే: సాధువు వేషంలో యాచకుడిలా వచ్చిన  దుండగుడు ఓ మహిళ దృష్టి మరల్చి ఆమె మంగళసూత్రాన్ని కాజేసిన సంఘటన ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... హస్తినాపురం ఇంద్రప్రస్థకాలనీలో శనివారం ఉదయం ఓ వ్యక్తి సాధువు వేషంలో ఇంటింటికీ తిరుగుతూ యాచించసాగాడు. ఓ మహిళ తన ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు. ఆమె భర్త ఆమె మాట వినడం లేదని.. నరదృష్టి పోయేలా పూజలు చేస్తే అన్నీ సర్దుకుంటాయని నమ్మించాడు. ఇంట్లోని హాల్లోకి వచ్చి బియ్యం తెమ్మన్నాడు. బియ్యాన్ని హాలు మధ్యలో పోసి అందులో ఆమె మంగళసూత్రాన్ని ఉంచమన్నాడు. అతడు చెప్పినట్లే ఆమె చేసింది. తర్వాత పసుపు కుంకుమ తెమ్మన్నాడు. ఆమె వంటగదిలోకి వెళ్లి తెచ్చేలోపు బంగారు మంగళసూత్రంతో సహా తుర్రుమన్నాడు. బాధితురాలి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని