logo

అప్పు తిరిగిమ్మని అడిగినందుకు స్నేహితుడి హత్య

గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు.

Published : 29 Jan 2023 02:27 IST

రామచంద్రాపురం రూరల్‌, న్యూస్‌టుడే: గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే చేధించారు. రామచంద్రాపురం సీఐ సంజయ్‌కుమార్‌ తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సెడం తాలూకా కండ్రపల్లి గ్రామానికి చెందిన మల్లేశం(45) తాపీమేస్త్రీ. పక్క గ్రామం కంద్రియన్‌పల్లి వాసి చంద్రప్పకు మూడేళ్ల క్రితం రూ.20 వేలు అప్పుగా ఇచ్చారు. కొంతకాలంగా మల్లేశంకు కనిపించకుండా చంద్రప్ప తెల్లాపూర్‌ కొమరంభీం కాలనీలో నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న మల్లేశం 24న చంద్రప్ప ఇంటికి వచ్చి డబ్బులు అడిగాడు. నాలుగు రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పాడు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో మద్యం తాగుదాగుదామని చెప్పి మల్లేశంను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. మత్తులో దింపి అనంతరం బండరాయితో తలపై మోది మల్లేశంను చంద్రప్ప హత్య చేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని రైల్వేట్రాక్‌ దగ్గరకు తీసుకెళ్లి వెళ్లి తగలబెట్టాడు. మృతుడి సెల్‌ఫోన్‌, దుస్తుల్ని చంద్రప్ప తీసుకెళ్లాడు. సెల్‌ఫోన్‌ ట్రాక్‌ ఆధారంగా పోలీసులు కేసు విచారణ జరిపి చంద్రప్పను కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకొని రిమాండ్‌కు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని