logo

వినయ్‌రామ్‌కు మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ గ్రీన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ పురస్కారం

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లానెట్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌, వేద భారత్‌ ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ అధినేత వినయ్‌రామ్‌ నిడదవోలు ‘మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ గ్రీన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కించుకున్నారు.

Published : 29 Jan 2023 02:35 IST

కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా అవార్డు స్వీకరిస్తున్న వినయ్‌రామ్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్లానెట్‌ గ్రీన్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌, వేద భారత్‌ ఫుడ్‌ ప్రైవేట్‌ లిమిడెట్‌ అధినేత వినయ్‌రామ్‌ నిడదవోలు ‘మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ గ్రీన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు దక్కించుకున్నారు. కేవలం వ్యాపార దృక్కోణమే కాకుండా ఇతోధికంగా పర్యావరణ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వ్యాపార సంస్థలు నడిపే వారికి ఇంటరాక్టివ్‌ ఫోరమ్‌ ఆన్‌ ఇండియన్‌ ఎకానమీ(ఐఎఫ్‌ఐఈ) ఈ అవార్డులను అందిస్తుంటుంది. ఇటీవల దిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చేతుల మీదుగా అవార్డును స్వీకరించినట్లు వినయ్‌రామ్‌ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని