డిమాండ్ ఎంతయినా.. పవర్ తగ్గేదేలె
నగర శివార్లలో పెద్దఎత్తున డేటా కేంద్రాలు రాబోతున్నాయి. ఔటర్ బయట ఏర్పాటుకు ఇప్పటికే పలు ప్రాంతాలను ఆయా సంస్థలు ఎంపిక చేస్తున్నాయి.
శివారులో డేటా కేంద్రాలతో కరెంట్ వినియోగం పైపైకి
దశలవారీగా సరఫరాకు విద్యుత్తు సంస్థల ఏర్పాట్లు
మీర్ఖాన్పేటలో నిర్మాణంలో ఉన్న డేటా కేంద్రం
ఈనాడు, హైదరాబాద్: నగర శివార్లలో పెద్దఎత్తున డేటా కేంద్రాలు రాబోతున్నాయి. ఔటర్ బయట ఏర్పాటుకు ఇప్పటికే పలు ప్రాంతాలను ఆయా సంస్థలు ఎంపిక చేస్తున్నాయి. కొన్నిచోట్ల కేంద్రాల ఏర్పాటు పనులు మొదలవగా.. మిగతా ప్రాంతాల్లో దశలవారీగా రానున్నాయి. ఈ కేంద్రాలు పని చేసేందుకు అధిక కరెంట్ వినియోగం అవసరం ఉంటుంది. అమెజాన్ 120 మెగావాట్లు, మైక్రోసాఫ్ట్ 160 మెగావాట్లు కరెంట్ కావాలని విద్యుత్తు సంస్థలను కోరాయి. మొదట డేటా కేంద్రాలు తక్కువ సామర్థ్యంతో ఏర్పాటు చేసి క్రమంగా పెంచుకుంటూ వెళతామని.. అందుకు అనుగుణంగా కరెంట్ను సరఫరా చేయాలని కోరాయి. ప్రస్తుతం 33 మెగావాట్ల సామర్థ్యం కల్గిన డేటా కేంద్రాలు మాత్రమే నగరంలో పనిచేస్తున్నాయి.
క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరగడంతో డేటా కేంద్రాల అవసరం పెరుగుతోంది. ఇదివరకు ఈ కేంద్రాలు ఎక్కువగా ముంబయిలో ఉండేవి. ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. అమెజాన్ ఇండియా ఫార్మాసిటీ, ఫ్యాబ్సిటీ, చందనవెల్లిలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. మైక్రోసాఫ్ట్ అతిపెద్ద డేటా క్లస్టర్ను హైదరాబాద్లో ఏర్పాటుకు నిర్ణయించింది. చందన్వెల్లి, ఎల్లికట్ట, మేకగూడలో వీరి కేంద్రాలు రాబోతున్నాయి. వీటికి సమీపంలోనే తమ 400కేవీ, 220కేవీ ఉపకేంద్రాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ట్రాన్స్కో అంటోంది.
* ఫార్మాసిటీ మీర్ఖాన్పేటలో మహేశ్వరం 400కేవీ విద్యుత్తు ఉపకేంద్రం ఉంది. ఇక్కడి నుంచి ఫార్మాసిటీలోని డేటా కేంద్రానికి సరఫరా చేసే సామర్థ్యం ఉంది.
* చందన్వెల్లిలో 220/132కేవీ ఉపకేంద్రం అందుబాటులో ఉంది.
* ఇతర కేంద్రాలకు కరెంట్ సరఫరా చేసేందుకు నెట్వర్క్ సిద్ధంగా ఉందని అధికారులు అంటున్నారు. అవసరమైన చోట కొత్త లైన్లు వేస్తామని చెబుతున్నారు.
గేటెడ్ కమ్యూనిటీలకు..
డేటా కేంద్రాలే కాదు.. శివార్లలో ముఖ్యంగా ఇన్నర్ రింగ్రోడ్డు చుట్టుపక్కల 30 నుంచి 40 అంతస్తుల ఆకాశహర్మ్యాలు వస్తున్నాయి. ఇక్కడ ఒక్కో కమ్యూనిటీలో మూడువేల నుంచి నాలుగువేల ఇళ్లు వస్తున్నాయి. ఒక్కోదానికి 30మెగావాట్ల వరకు కరెంట్ డిమాండ్ ఉంటుంది. ఈ తరహా ప్రాజెక్టుల్లో బల్క్ కనెక్షన్ తీసుకుని అంతర్గతంగా వారు కరెంట్ సరఫరా చేసుకుంటారు. ఇందుకోసం ఏకంగా 33కేవీ హెచ్టీ కనెక్షన్ తీసుకుంటారు.
రింగ్తో సౌలభ్యం..
సిటీ చుట్టూ 400కేవీ రింగ్ను సీఎం ఆదేశాల మేరకు ట్రాన్స్కో ఏర్పాటు చేసింది. ఒక ఉపకేంద్రంలో ఏదైనా సమస్య వచ్చినా ఇబ్బంది లేకుండా ఇతర చోట్ల నుంచి కరెంట్ సరఫరా చేసేందుకు వీలుగా రింగ్ను కలిపారు. ఇందుకోసం మధ్యలో ఖాళీగా ఉన్న కొంతదూరం 142 సర్క్యూట్ కిలోమీటర్ల ఓవర్హెడ్ లైన్లను వేశారు. దీంతో సిటీ చుట్టూ ఉన్న 400కేవీ 6 విద్యుత్తు ఉపకేంద్రాలు ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యాయి. ఇందుకోసం అవసరమైన చోట కొత్తగా 220 కేవీ ఉపకేంద్రాలను సిటీ చుట్టూ పక్కల నిర్మించారు. దీంతో డేటా కేంద్రాలు శివార్లలో ఎక్కడ వచ్చినా సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని విద్యుత్తు సంస్థలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్