logo

అక్కడ హత్యాయత్నం.. ఇక్కడ చోరీలు

వరుస గొలుసు చోరీలతో హైదరాబాద్‌లో అలజడి రేపిన అంతర్రాష్ట్ర ముఠాలోని ప్రధాన నిందితుణ్ని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Published : 30 Jan 2023 03:34 IST

ఈనాడు- హైదరాబాద్‌: వరుస గొలుసు చోరీలతో హైదరాబాద్‌లో అలజడి రేపిన అంతర్రాష్ట్ర ముఠాలోని ప్రధాన నిందితుణ్ని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లా జింజానా గ్రామానికి చెందిన మంగల్‌ అలియాస్‌ మంగల్‌ సింగ్‌(38)ను ఇటీవల అక్కడి స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై జింజానా స్టేషన్‌లో దోపిడీతో పాటు.. హత్యాయత్నం కేసు కూడా ఉంది. హైదరాబాద్‌లో చోరీలు చేసి అనంతరం యూపీకి పారిపోయిన అతణ్ని జింజానా పోలీసులు ఈనెల 24న అరెస్టు చేసి ముజఫర్‌నగర్‌ జైలుకు తరలించారు. సమాచారం అందుకున్న ఉప్పల్‌, మల్కాజిగిరి పోలీసులు పీటీ వారెంటుపై మంగల్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చారు. శనివారం న్యాయస్థానంలో హాజరుపర్చారు. కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు.

ఆ ముగ్గురు ఎక్కడ..!.. వరుస చోరీలకు పాల్పడింది ఇద్దరే అయినా.. నలుగురు కలిసి ముఠాగా ఏర్పడ్డారు. మంగల్‌ సింగ్‌, పింకు, దీపక్‌, సెవాగే అంతకుముందు బెంగళూరులో ఐదు చోట్ల గొలుసు చోరీలు చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ముగ్గురి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు