logo

జూదం కేసులో ఫిర్జాదిగూడ డిప్యూటీ మేయర్‌ అరెస్టు

ఆదివారం రాత్రి పర్వతాపూర్‌లోని సాయి ఐశ్వర్య కాలనీలో జూదం వ్యవహారంలో ఫిర్జాదిగూడ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ కుర్రా శివకుమార్‌ గౌడ్‌పై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 

Published : 30 Jan 2023 14:06 IST

బోడుప్పల్‌: ఆదివారం రాత్రి పర్వతాపూర్‌లోని సాయి ఐశ్వర్య కాలనీలో జూదం వ్యవహారంలో ఫిర్జాదిగూడ నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ కుర్రా శివకుమార్‌ గౌడ్‌పై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ మేయర్‌తో పాటు కార్పొరేటర్‌ కె.మహేశ్, పలువురు భారాస నాయకులు యాకారం మహేశ్‌, ఎల్‌.రఘుపతిరెడ్డి, టి.శ్రీధర్‌రెడ్డి, పి.అంజిరెడ్డి, సీహెచ్‌ జగదీశ్వరరెడ్డి, బి.కృష్ణలతోపాటు మరో ఆరుగురిపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ముందస్తు సమాచారంతో మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు జూదం శిబిరంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సుమారు రూ.23 లక్షల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని