logo

అల్లుడే నిందితుడు

చిగురాల్‌పల్లి గ్రామానికి చెందిన పెంటయ్యపై కత్తితో దాడిచేసి 16 పోట్లు పొడిచిన ఘటన ఈనెల 28 జరగ్గా పోలీసులు కేసును ఛేదించారు.

Published : 31 Jan 2023 01:05 IST

మామపై హత్యాయత్నం కేసు ఛేదన  


సుభాష్‌, దశరథ్‌

పరిగి గ్రామీణ, న్యూస్‌టుడే: చిగురాల్‌పల్లి గ్రామానికి చెందిన పెంటయ్యపై కత్తితో దాడిచేసి 16 పోట్లు పొడిచిన ఘటన ఈనెల 28 జరగ్గా పోలీసులు కేసును ఛేదించారు. నిందితులు పరారు కాగా రెండు రోజుల్లోనే పోలీసులు ఛేదించి నిందితులను పట్టుకోగలిగారు. ఎస్సై విఠల్‌రెడ్డి కథనం ప్రకారం..పెంటయ్య (కూతురు భర్త) అల్లుడైన సుభాష్‌ (30) గతంలో భూ విషయంలో మామతో గొడవ పడ్డాడు. అనుమానంతో సుభాష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా నిజం బయటపెట్టాడు. భూమి కోసం ఎలాగైనా మామను చంపాలని నిర్ణయించుకుని పూడూరు గ్రామానికి చెందిన చెట్ల దశరథ (19)తో కలిసి కత్తితో దాడికి పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో హత్యాయత్నం కింద ఇద్దరిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. దాడిలో గాయపడ్డ పెంటయ్య ప్రస్తుతం నగరంలోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని