కొరవడిన ప్రోత్సాహం.. కనిపించని చైతన్యం!
జిల్లాలో నెహ్రూ యువ కేంద్ర కార్యక్రమాలు రోజురోజుకీ కనుమరుగవుతున్నాయి.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల విజయవంతంలో, జన బాహుళ్యాన్ని చైతన్యం చేయడంలో యువకుల పాత్ర ఎనలేనిది.
మొక్కుబడిగా నెహ్రూ యువ కేంద్రాలు
మిట్టకోడూరులో మురుగు కాల్వను శుభ్రం చేస్తున్న యువకులు
న్యూస్టుడే, పరిగి, వికారాబాద్ కలెక్టరేట్: జిల్లాలో నెహ్రూ యువ కేంద్ర కార్యక్రమాలు రోజురోజుకీ కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల విజయవంతంలో, జన బాహుళ్యాన్ని చైతన్యం చేయడంలో యువకుల పాత్ర ఎనలేనిది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ సంఘాలకు గుర్తింపు లేక వారిలో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలముకుంటున్నాయి. జిల్లా ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇదే పరిస్థితి నెలకొంది.
అమలు ఎక్కడ..
వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజక వర్గాల పరిధిలో 250 గుర్తింపు పొందిన సంఘాలు ఎన్వైకె కింద నమోదై ఉన్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో వీటి సంఖ్య రెట్టింపు స్థాయిలో ఉంది. దాదాపు 3,658 మంది సభ్యులున్నారు. క్షేత్ర స్థాయిలో సహకారం అందక చివరకు వాటి ఉనికే ప్రశ్నార్థకమైంది.
* యువతకు నాయకత్వ లక్షణాలు, నైపుణ్యం పెంపొందిస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలి. గ్రామాల్లో తరచూ వివిధ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, వ్యక్తిత్వ వికాసం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం దేశాభివృద్ధికి ఉపయోగపడేలా తీర్చిదిద్దడం యువ కేంద్రం లక్ష్యాలు. కానీ ఇవి అమలు కావడం లేదు. కనీసం మండల స్థాయిలో లేదంటే గ్రామ స్థాయిలో కూడా యువతకు క్రీడా పోటీలు నిర్వహించడంలేదు.
రెండింటి లక్ష్యాలూ ఒకటే..
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లా నెహ్రూ యువ కేంద్రం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యువజన సర్వీసుల శాఖ పనిచేస్తోంది. రెండింటి లక్ష్యాలు దాదాపుగా ఒక్కటే. కొన్నేళ్లుగా సంఘాలకు దిశానిర్దేశం లేకుండా పోయింది. జిల్లా వేరు పడడంతో సంఘాలకు ఎన్వైకె నుంచి దాదాపు లింకు తొలగిపోయింది. నేటికీ అది ఉమ్మడి జిల్లాకే ప్రాతినిథ]్యం వహిస్తోంది. సంబంధిత అధికారుల నుంచి మాత్రం సంఘాలకు ఎలాంటి సమాచారం అందడం లేదు.
ఉమ్మడి జిల్లా పరిధిలోనే: హనుమంతరావు, జిల్లా క్రీడలు, యువజన సంక్షేమాధికారి
ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఎన్వైకె కార్యాలయం ఉంది. ప్రత్యేకించి వేరు పడితేనే జిల్లాకు ప్రయోజనం. ఇటీవలి కాలంలో జిల్లా కేంద్రంలో ఎయిడ్స్పై అవగాహన, కబడ్డీ పోటీలు నిర్వహించాం. తమవంతుగా యువతను ప్రోత్సహిస్తున్నాం.
ఇలా చేస్తే బాగు
* నూతనంగా ఏర్పడిన జిజిల్లాలో ఎన్వైకె కార్యక్రమాలు అమలు చేయాలి
* సమాజ సేవ చేస్తున్న సంఘాలకు తగిన ప్రోత్సాహకాలు అందించాలి * మండల, తాలుకా స్థాయిలో కెరీర్ గైడెన్స్ శిక్షణ అవసరం * అన్ని సంఘాలకు క్రీడా పరికరాల మంజూరు * అభివృద్ధి పనుల్లోనూ భాగస్వామ్య కల్పన * క్షేత్ర స్థాయిలో సంఘాలను ప్రోత్సహించే కార్యక్రమాల అమలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా