ఎక్కాడు.. మధ్యలో ఇరుక్కుపోయాడు
సరదా పడి ఓ పెద్ద బండ ఎక్కాడు.. పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలోకి జారి పడిపోయాడు. దాదాపు 3గంటల పాటు అందులో ఇరుక్కుపోయిన సంఘటన తిరుమలగిరి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.
బండల మధ్యలో రాజు
కార్ఖానా, న్యూస్టుడే: సరదా పడి ఓ పెద్ద బండ ఎక్కాడు.. పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలోకి జారి పడిపోయాడు. దాదాపు 3గంటల పాటు అందులో ఇరుక్కుపోయిన సంఘటన తిరుమలగిరి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన రాజు(26) బతుకు దెరువుకోసం నగరానికి వచ్చాడు. సోమవారం సాయంత్రం తిరుమలగిరి కెన్ కళాశాల సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ ఉన్న పెద్ద బండను చూసి సంబరపడి దానిపైకి ఎక్కాడు. పట్టుతప్పి రెండు బండరాళ్ల మధ్యలో పడ్డాడు. బయటకు రాలేక కేకలు వేశాడు. స్థానికులు గుర్తించి తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఠాణాకు చెందిన కానిస్టేబుళ్లు రాంబాబు, బాషా, రాజు.. అక్కడికి చేరుకొని అతడి భూజానికి తాళ్లు కట్టి అతికష్టం మీద బయటకు లాగారు. అనంతరం అతడిని ప్రథమ చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి సోమవారం రాత్రి సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వదిలారు. రాజును క్షేమంగా కాపాడిన కానిస్టేబుళ్లను సీఐ శ్రావణ్కుమార్ అభినందించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL 2023: టోర్నీలోని మిగతా మ్యాచుల్లో కేన్ విలియమ్సన్ ఆడడు: గుజరాత్ టైటాన్స్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Corona Update: ఆరు నెలల తర్వాత.. అత్యధిక కేసులు..
-
Movies News
Costume Krishna: శ్రీదేవి కోసం అప్పటికప్పుడు డ్రెస్ డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ కృష్ణ
-
General News
Amaravati: అరసవల్లి సూర్యనారాయణస్వామిని దర్శించుకున్న అమరావతి రైతులు
-
Sports News
Salim Durani: క్రికెట్ దిగ్గజం సలీమ్ దురానీ కన్నుమూత