నిల్చొనే సంతకాలు.. వసతుల్లేక వెతలు
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే కీలక శాఖ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు. అదే స్థాయిలో సౌకర్యాలతో ఉండాల్సిన సంబంధిత కార్యాలయాలు మాత్రం భిన్న పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి.
రైటర్ కార్యాలయాలే దిక్కు.. దళారులదే దర్జా
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దుస్థితి
కూకట్పల్లి కార్యాలయంలో తిప్పలు ఇలా..
ఈనాడు - హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే కీలక శాఖ స్టాంపులు, రిజిస్ట్రేషన్లు. అదే స్థాయిలో సౌకర్యాలతో ఉండాల్సిన సంబంధిత కార్యాలయాలు మాత్రం భిన్న పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి. సంతకాలు పెట్టేవారికి కుర్చీ, టేబుల్ కూడా కానరావు. నిల్చొని సంతకాలు పెట్టడం, సరైన బల్లలు లేకపోవడంతో పత్రాలు కింద పడిపోవడం.. సంతకాలు సరిగా టాలీ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి డాక్యుమెంట్ రైటర్ల కార్యాలయాల్లోనే సంతకాలు పెట్టాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితులే దళారులను ఆశ్రయించడానికి కారణమవుతున్నాయి. రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాలయానికి వెళ్లేవారికి దళారులే స్వాగతం పలికి.. డాక్యుమెంట్ రైటర్ కార్యాలయంలో కూర్చోబెట్టి, పనులన్నీ అయ్యే దాకా వెంట ఉండి కావాల్సినంత దండుకొని పంపిస్తున్నారు.
ప్రైవేటు భవనాల్లోనే..
రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల్లో 41 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుండగా 90 శాతం ప్రైవేటు భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వినియోగదారుల(స్థిరాస్తి కొన్నవారు.. అమ్మేవారు) నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.కోట్లలో ఆదాయం ఏటా సమకూరుతుంది. రాసుకునేందుకు, డాక్యుమెంట్లపై సంతకాలు చేసేందుకు టేబుళ్లు.. ఇలా కార్పొరేట్ కార్యాలయం మాదిరి సౌకర్యాలు కల్పించాల్సిన ఈ శాఖ కార్యాలయాల్లో అలాంటి ఆనవాళ్లు ఎక్కడా కనిపించవు. కనీసం కూర్చునే చోటు లేక.. కార్యాలయం బయట రోడ్డుమీద ఆపిన కార్లలో వినియోగదారులు ఉంటే.. డాక్యుమెంట్ రైటర్, కార్యాలయ సిబ్బంది వారి వద్దకు వెళ్లి సంతకాలు తీసుకునే పరిస్థితి ఉంది.
వాహనాలు నిలపాలన్నా కష్టమే..
అద్దె భవనాల్లో ఉన్నా.. వందలాదిగా వచ్చే వినియోగదారుల వాహనాలు ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితి. పార్కింగ్ కూడా లేని భవనాల్లో, రోడ్డును ఆనుకుని ఉన్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చిన వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దూరంగా వాహనాలు పెట్టుకుని వస్తున్నారు. కార్యాలయాలకు ఎదురుగా అంతటా ద్విచక్రవాహనాలు నిలిపి ఉంచడంతో నడిచి వెళ్లడానికి కూడా వీల్లేని పరిస్థితి. బయట నుంచి చూస్తే కార్యాలయ బోర్డు కూడా సరిగా కనిపించదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.