ఏదీ సమరయోధుల ప్రస్తావన?
భారత స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన మహనీయులకు సంబంధించిన చిత్రాలు గానీ వారి ప్రస్తావన గానీ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వెబ్సైట్లో పొందుపర్చలేదని ప్రముఖ పాత్రికేయులు, రచయిత పి.సాయినాథ్ వ్యాఖ్యానించారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వెబ్సైట్ నిర్వహణపై రచయిత పి.సాయినాథ్ విమర్శ
సదస్సులో ప్రసంగిస్తున్న పి.సాయినాథ్. వేదికపై ప్రతాప్, కిరణ్, గాయకుడు రామ్ మిర్యాల
మాదాపూర్, న్యూస్టుడే: భారత స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన మహనీయులకు సంబంధించిన చిత్రాలు గానీ వారి ప్రస్తావన గానీ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వెబ్సైట్లో పొందుపర్చలేదని ప్రముఖ పాత్రికేయులు, రచయిత పి.సాయినాథ్ వ్యాఖ్యానించారు. స్వాతంత్ర పోరాటం కేవలం ఉత్తర భారత్లోని బిహార్, ఉత్తర్ప్రదేశ్లోనే జరగలేదని, దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ పోరాటంలో భాగస్వాములయ్యారన్నారు. సోమవారం స్వేచ్ఛా తెలంగాణ సంస్థ, ఫోరం ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో‘‘ ఫూట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడం’’ అంశంపై మాదాపూర్లోని ఫినిక్స్ ఏరినా పార్క్లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ వెబ్సైట్లో స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను ప్రస్తావించకపోవడం శోచనీయం. దక్షిణ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు, మల్లుస్వరాజ్యం, ఎన్.శంకరయ్య, నల్లకణ్ణు లాంటి ఎంతోమంది సమరయోధులు ఉన్నారు. అందులో 15 మంది పోరాట యోధుల విశేషాలను నేను రచించిన ఫూట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడం పుస్తకంలో ప్రస్తావించా.. ఇందులో ఆదివాసులు, దళితులు, రైతులు, మహిళలు ఉన్నారు. 1972-1980 మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వాలు తీసుకువచ్చిన 7 చట్టాల కారణంగా ఎంతోమంది దళిత, గిరిజన దిగువ తరగతులకు చెందిన స్వతంత్ర సమరయోధులను అధికారికంగా గుర్తించకుండా తిరస్కరించారు. 1880-1920 మధ్య బ్రిటిష్ అరాచక పాలనలో 165 మిలిమన్ల మంది భారతీయుల చనిపోయారు. ఇంతటి నరమేధానికి పాల్పడిన బ్రిటిష్ రాజ్యానికి సంబంధించిన ఎలిజబెత్ రాణి మరణిస్తే ఆమె గౌరవ సూచికంగా మన జాతీయ జెండాను అవనతం చేయడం సిగ్గుచేటు’’ అని వ్యాఖ్యానించారు. అంతకుముందు గాయకులు రామ్ మిర్యాల తన గీతాలతో అందరినీ ఆలోచింపజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు