రుణం ఇస్తామంటూ టోకరా
రుణం ఇస్తామంటూ ప్రముఖ సంస్థల పేరుతో మాట్లాడి రూ.లక్షల్లో మోసాలు చేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
9 కేసుల్లో నిందితుల అరెస్టు
ఈనాడు, హైదరాబాద్: రుణం ఇస్తామంటూ ప్రముఖ సంస్థల పేరుతో మాట్లాడి రూ.లక్షల్లో మోసాలు చేస్తున్న ముఠాను సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రీ యాక్టివేటెడ్ సిమ్కార్డుల ద్వారా మాట్లాడుతూ.. ఇతరుల బ్యాంకు ఖాతాలతో లావాదేవీలు నిర్వహిస్తూ పకడ్బందీగా ఈ నకిలీ దందా నడిపిస్తున్నారు. రుణం కోసం ఎవరైనా సంప్రదిస్తే మాట్లాడేందుకు ప్రత్యేకంగా కాల్సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. సైబరాబాద్లో 9 కేసుల్లో నిందితులైన ముగ్గుర్ని అరెస్టు చేశారు. 17 డెబిట్కార్డులు, 4 ఫోన్లు, నకిలీ రుణ వితరణ లేఖలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ కల్మేశ్వర్ శింగెనవార్, సైబర్క్రైమ్స్ డీసీపీ రితిరాజ్, సైబర్ టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్యామ్బాబు సోమవారం వెల్లడించారు. బిహార్లోని నలందా, పట్నా తదితర ప్రాంతాలకు చెందిన సుభాష్కుమార్, శ్రీకాంత్కుమార్, అమిత్కుమార్ నకిలీ కాల్సెంటర్లలో టెలీకాలర్లుగా పనిచేశారు. అంతా ఒక ముఠాగా ఏర్పడి రుణ మోసాలు చేస్తున్నారు. ప్రముఖ రుణ సంస్థల పేరిట ఆన్లైన్, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చి.. తమ ఫోన్ నెంబరు ఉంచుతారు. లింకు లేదా ప్రకటన క్లిక్ చేయగానే కాల్సెంటర్ నుంచి మాట్లాడుతున్నామంటూ నిబంధనలు చెబుతారు. రుణం ఇచ్చేందుకు ఒప్పందం రుసుం, జీఎస్టీ అంటూ వసూలు చేస్తారు. ఇలా వచ్చిన డబ్బును గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదల ఖాతాల్లో జమ చేస్తారు. ఆ తర్వాత వాటిని బదిలీ చేసుకుంటారు. నిందితులు తమ మోసాల కోసం 725 ప్రీయాక్టివేటెడ్ సిమ్కార్డులు, 675 ఇతరుల బ్యాంకు ఖాతాల్ని వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కంటోన్మెంట్ పోరు అభ్యర్థులు ఖరారు
[ 17-04-2024]
భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవ్య శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమితి అధ్యక్షుడు డా.భగవంత్రావు, ప్రధాన కార్యదర్శి గోవింద్రాఠీ తెలిపారు. -
నాడు.. నేడు.. సాగరే ఆధారం
[ 17-04-2024]
నగరానికి తాగునీటి సమస్య లేకుండా జలమండలి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో తరలించడానికి ప్రణాళిక చేపడుతోంది. ఇందులో భాగంగా నాగార్జునసాగర్ వద్ద అత్యవసర పంపింగ్ స్టేషన్ నిర్మాణం షురూ చేసింది. -
నాడు అనుచరులు.. నేడు ప్రత్యర్థులు
[ 17-04-2024]
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆ ఇద్దరూ ఒకప్పుడు పీజేఆర్ అనుచరులు. ప్రస్తుత నగర పరిధిలో ఎమ్మెల్యేలు. మరికొద్ది రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి తలపడుతున్నారు. -
తప్పని గురి.. విజయతీరం చేరి
[ 17-04-2024]
సమాజానికి తమవంతు సేవ చేయాలన్న ఆశయం.. విభిన్నమైన ఆలోచనా విధానం.. పరీక్షల్లో విజయం పొందాలన్న ఆత్మవిశ్వాసంతో వీరంతా సివిల్స్వైపు అడుగులేశారు. -
మూడు ప్రమాదాలు.. 8 మంది మృతి
[ 17-04-2024]
ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న అయిదుగురూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని గౌరవరం వద్ద జాతీయరహదారిపై మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. -
ఆశ్రయమిచ్చిన ఇంటి¸నే దోచిన బాలిక
[ 17-04-2024]
ఇన్స్టాలో పరిచయమైన యువకుడి కోసం ఓ బాలిక ఆశ్రయం ఇచ్చిన బంధువుల ఇంటికే కన్నం వేసింది. చిలకలగూడ ఠాణాలో మంగళవారం ఈస్ట్జోన్ డీసీపీ ఆర్.గిరిధర్ వివరాలు వెల్లడించారు. -
రకుల్ తళుకుల్
[ 17-04-2024]
సినీనటి రకుల్ ప్రీత్సింగ్ మంగళవారం మాదాపూర్లో సందడి చేశారు. ఓ చిరుధాన్యాల ఆధారిత రెస్టారెంట్ను ప్రారంభించారు. -
రైల్వేస్టేషన్లలో మురుగు నీటి రీసైక్లింగ్..
[ 17-04-2024]
ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. నగరంలో నీటి కటకట ఏర్పడడంతో ఉద్యానాలు ఎండిపోతున్నాయి. దీనికంతటికీ కారణం నీరు తగినంత లేకపోవడమేనని సమాధానం వస్తుంది. -
అలలపై సాహసం.. అలుపెరగని పోరాటం
[ 17-04-2024]
‘అమ్మా నేను హుస్సేన్సాగర్లో సెయిలింగ్ నేర్చుకుంటానని కుమార్తె అడిగినప్పుడు.. తల్లిదండ్రులు తొలుత ఆందోళన చెందారు. ఆమె ఆరోగ్యం ఏమవుతుందోనని భయపడుతూనే కాదనలేకపోయారు. -
మహిళ హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు
[ 17-04-2024]
మహిళలను హతమార్చి బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించే పాత నేరస్థుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఓ మహిళను హత్యచేసిన కేసులో ఈ శిక్ష పడింది. -
మత్తు తలకెక్కి.. చదువు అటకెక్కించి..
[ 17-04-2024]
వీసా గడువు ముగిసినా నగరంలో అక్రమంగా నివసిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న మొరాకో దేశస్థుడు హెచ్న్యూ పోలీసులకు చిక్కాడు. గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడ్డ నిందితుడు.. డ్రగ్స్ పెడ్లర్లతో స్నేహం చేస్తున్నాడు. -
నిఘా పెట్టి.. ఆచూకీ కనిపెట్టి
[ 17-04-2024]
నలుగురు యువకులు ఇళ్లలో చొరబడి ఖరీదైన వస్తువులు, ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతో జీడిమెట్ల నేరవిభాగం ఇన్స్పెక్టర్ విజయ్నాయక్ ప్రత్యేక నిఘా పెట్టి వారిని కటకటాల్లోకి పంపించారు. -
కళాకారులకు పదవీ విరమణ ఉండదు
[ 17-04-2024]
నాటకరంగానికి తుర్లపాటి రామచంద్రరావు విశేష సేవలు అందించారని ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కొనియాడారు. -
ప్రయాణికులు ఫుల్.. ఎంఎంటీఎస్లు నిల్
[ 17-04-2024]
ఎంఎంటీఎస్లను ఎందుకు తగ్గించారు? -
ఏఐడీఎంకేను గెలిపించండి: అసదుద్దీన్
[ 17-04-2024]
దేశంలో మజ్లిస్ అభ్యర్థులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించాల్సి ఉందని.. అందుకు తమిళనాడులో పార్టీ కార్యకర్తలను కలవలేకపోతున్నానని హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. -
ఒవైసీకి ఓటెందుకెయ్యాలో చెప్పాలి: రాజాసింగ్
[ 17-04-2024]
తమను చంపాలని చూస్తున్నారన్న ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. -
రూ.28 లక్షలు స్వాధీనం
[ 17-04-2024]
జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ బృందాల ద్వారా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు తనిఖీల్లో రూ.28,22,000 నగదు, రూ.2,37,702 విలువైన ఇతర వస్తువులు, 69.03 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు. -
సరదా అనుకోకు.. ప్రాణాల మీదకు తెచ్చుకోకు
[ 17-04-2024]
‘ఈత’ అంటే ప్రతి ఒక్కరికీ ఉత్సాహమే. చెరువు కనిపించినా, వాగులో నీటిని చూసినా, పిల్లలైనా, పెద్దలైనా ఒక్కసారైనా ఈత కొట్టాలని ఉవ్విళూరుతారు. -
జిల్లా సహాయ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
[ 17-04-2024]
వికారాబాద్ జిల్లా నూతన సహాయ కలెక్టర్గా ఉమా హారతి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆమె పదవీ బాధ్యతలను స్వీకరించారు. -
గనుల వ్యర్థాలు.. ఆదాయ నిక్షేపాలు
[ 17-04-2024]
జిల్లాలోని నాపరాళ్ల వ్యర్థాలను సిమెంటు కర్మాగారాలకు విక్రయిస్తే గనుల శాఖకు రూ.కోట్ల కొద్ది ఆదాయం సమకూరే అవకాశం ఉంది. అయితే ఆ దిశగా అధికారులు దృష్టి సారించడం లేదు. ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా కుప్పలు పేరుకుపోయాయి.