నేర వార్తలు
విద్యుత్తు బిల్లు కట్టలేదని.. కనెక్షన్ తొలగిస్తామని వచ్చిన సంక్షిప్త సమాచారాన్ని నమ్మి ఓ మహిళ.. రూ.76 వేలు పోగొట్టుకుంది. నేరేడ్మెట్ ఠాణా పరిధి గోకుల్ నగర్లో ఉంటున్న మహిళ (50) చరవాణికి సోమవారం ఓ సందేశం వచ్చింది.
విద్యుత్తు బిల్లు చెల్లించాలని సంక్షిప్త సమాచారం
యాప్ డౌన్లోడ్ చేసుకోగానే రూ.76 వేలు మాయం
నేరేడ్మెట్, న్యూస్టుడే: విద్యుత్తు బిల్లు కట్టలేదని.. కనెక్షన్ తొలగిస్తామని వచ్చిన సంక్షిప్త సమాచారాన్ని నమ్మి ఓ మహిళ.. రూ.76 వేలు పోగొట్టుకుంది. నేరేడ్మెట్ ఠాణా పరిధి గోకుల్ నగర్లో ఉంటున్న మహిళ (50) చరవాణికి సోమవారం ఓ సందేశం వచ్చింది. సకాలంలో విద్యుత్తు బిల్లు చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తామని అందులో ఉంది. అందులో ఉన్న నంబరుకు ఫోన్ చేయగా.. ఓ వ్యక్తి మాట్లాడారు. బిల్లు చెల్లించేందుకు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించాడు. మొదటగా యాప్లో రూ.10 చెల్లించాలని చెప్పగా, అలాగే చేసింది. అనంతరం ఆమె బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.76,400 డ్రా అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ ముగ్గురూ దొరికారు..!
శామీర్పేట, న్యూస్టుడే: నగర శివారు ఉద్దెమర్రిలో తుపాకీతో కాల్పులు జరిపి దోపిడీ చేసిన ఘటనలో పోలీసులు ముగ్గుర్ని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఈ ముగ్గురు పథకం ప్రకారం దోపిడీ చేసినట్లు తేల్చారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామంలోని మద్యం దుకాణం దగ్గర గత నెల 23 అర్ధరాత్రి వేళ దోపిడీ జరిగింది. దుకాణంలో పనిచేసే ఇద్దరూ రాత్రి 10 గంటలకు షట్టర్ మూసేసి రోజువారీగా వచ్చే కలెక్షన్ డబ్బుతో బయటకి రాగానే ముగ్గురు నిందితులు నంబరు ప్లేటు లేని ద్విచక్రవాహనంపై వచ్చారు. డబ్బు ఇవ్వాలంటూ దాడి చేశారు. సిబ్బంది ఎదురుతిరగడంతో మూడు రౌండ్లు కాల్పులు జరిపి రూ.2.08 లక్షలు దోపిడీ చేసి పరారయ్యారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు, ఇతర వివరాల ఆధారంగా దాదాపు ఏడు రోజుల తర్వాత నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.
రసాయనాల డ్రమ్ము పేలి కార్మికుడి దుర్మరణం
జీడిమెట్ల(హైదరాబాద్), న్యూస్టుడే: ఓ ప్లాస్టిక్ గోదాం యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం గాల్లో కలిసింది. జీడిమెట్ల పారిశ్రామికవాడ చెంత గంపల బస్తీలో ముషీరాబాద్కి చెందిన మహమ్మద్ మక్బుద్ కొన్నేళ్లుగా ప్లాస్టిక్ రీసైకిల్ గోదాం నిర్వహిస్తున్నాడు. అందులో ఉత్తరప్రదేశ్ ఫైజాబాద్కి చెందిన విజయ్ప్రజాపత్(35), రమేశ్ కార్మికులుగా పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం యంత్రంపై రసాయనాల డ్రమ్మును కట్ చేస్తుండగా ఒత్తిడితో ఒక్కసారిగా పేలింది. ప్రమాదంలో విజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. అప్రమత్తమైన స్థానికులు 108కి సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా విజయ్ మృతిచెందినట్లు పోలీసులు చెప్పారు. దట్టమైన పొగలతో మంటలు చెలరేగడంతో జీడిమెట్ల అగ్నిమాపక సిబ్బంది వచ్చి అదుపు చేశారు. ఘటనాస్థలాన్ని జీడిమెట్ల ఠాణా ఇన్స్పెక్టర్ ఎం.పవన్, ఎస్సై సతీష్రెడ్డి, పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.
ఇన్స్టాలో పరిచయం.. నగరానికి రప్పించి మోసం
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన దిల్లీకి చెందిన మహిళను నగరానికి రప్పించి, ఏకాంతంగా గడిపి, తెల్లారేసరికి అదృశ్యమయ్యాడు ఓ ప్రబుద్ధుడు. పోలీసుల వివరాల ప్రకారం.. జీడిమెట్ల ప్రాంతానికి చెందిన ఫయాజుద్దీన్ ఆఫ్రిదికి కొద్ది రోజుల కిందట దిల్లీకి చెందిన నృత్యకారిణి(29) ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. ఆమె భర్తకు దూరంగా ఏడేళ్ల కుమారుడితో ఉంటోంది. ఇద్దరి మధ్య మాటలు కలవడంతో కలిసేందుకు నగరానికి రావాలంటూ కోరాడు. అందుకోసం విమాన టిక్కెట్లు సమకూర్చాడు. మూడు రోజుల కిందట ఆమె నగరానికి రాగా.. ఇద్దరూ కలిసి బంజారాహిల్స్లోని ఓయో గదిలో గడిపారు. మరునాడు ఉదయం ఆమె నిద్ర లేచి చూడగా ఆఫ్రిది కనిపించలేదు. చరవాణిలో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి పిలిపించి, మోసం చేసి వెళ్లిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఓయోలో అతడు ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంగా ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
లిఫ్టులోకి చొరబడి వృద్ధురాలి మెడలో గొలుసు గుంజుకున్నాడు
బాధితురాలు స్వర్ణలత
నిజాంపేట, న్యూస్టుడే: ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును దుండగుడు లాక్కెళ్లాడు. బాచుపల్లి పోలీసులు, బాధితురాలు తెలిపిన ప్రకారం.. నిజాంపేట శ్రీనివాసకాలనీలోని సిరిబాలాజీ రెసిడెన్సీలో పోలవరపు స్వర్ణలత(62) తన కుమారుడితో కలిసి ఉంటున్నారు. మధురానగర్లోని సాయిబాబా ఆలయానికి మంగళవారం మధ్యాహ్నం వెళ్లారు. మధ్యాహ్నం ఆలయాన్ని మూసే సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి లోపలికి వచ్చాడు. ‘పరిసరాల్లో ఎక్కడైనా అద్దె ఇల్లు ఖాళీగా ఉందా అమ్మా?’ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. స్వర్ణలత తనకు తెలియదని సమాధానమిచ్చి, నడుచుకుంటూ తన ఇంటికి వెళ్తుండగా.. మాట్లాడుతూ ఆమె వెంట వెళ్లాడు. ఇంతలో తన అపార్ట్మెంట్ రావడంతో ఆమె లిఫ్టు ఎక్కారు. తలుపు వేయబోతున్న సమయంలో ఆ వ్యక్తి బలవంతంగా తలుపు తెరుచుకుని లోపలికి వచ్చాడు. అందుకు వృద్ధురాలు అడ్డుకుని, గట్టిగా అరిచేలోపే ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసుకుని తెంపుకొని అక్కడి నుంచి మెరుపు వేగంతో పరారయ్యాడు. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. సమాచారం అందుకున్న బాచుపల్లి సీఐ కె.నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకకరించారు. ఆగంతకుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.
గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి
గౌరవ్కుమార్
చైతన్యపురి, న్యూస్టుడే: గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ విద్యార్థి న్యూనాగోలు వద్ద నెమ్మదించి పడిపోయాడు. అతడు ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన స్థానికులు నీరు తాగించడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. 108కి ఫోన్ చేస్తే అందుబాటులో లేకపోవడంతో ఆటోలో నాగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిపారు. అతడి వద్ద గుర్తింపు కార్డు ఆధారంగా రాంగిర్వార్ గౌరవ్కుమార్, నాగోలు ఇందూఅరణ్య సమీపంలోని శ్రేయాస్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నట్లు గుర్తించారు. ఆర్కేపురం వాసి అని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
[ 19-04-2024]
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
[ 19-04-2024]
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు