హైబ్రిడ్ కార్లకు గిరాకీ
రాజధాని వాసులు హైబ్రిడ్ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. విద్యుత్తుతోపాటు పెట్రోల్, డీజిల్తో నడిచే కార్లకు నాలుగైదు నెలల నుంచి అనూహ్యంగా డిమాండ్ ఏర్పడింది.
పూర్తిస్థాయి విద్యుత్తు వాహనాలపై ఏ మూలనో అనుమానం
రాజధాని వాసులు హైబ్రిడ్ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. విద్యుత్తుతోపాటు పెట్రోల్, డీజిల్తో నడిచే కార్లకు నాలుగైదు నెలల నుంచి అనూహ్యంగా డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్లోని ప్రముఖ కంపెనీల కార్ల డీలర్లు, షోరూంలలో హైబ్రిడ్ కారు కొనాలంటే నెలల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. యువకులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అచ్చంగా విద్యుత్తు కార్లనే కొంటుండగా మధ్య వయసు వారు, స్థిరాస్తి వ్యాపారుల్లో కొందరికి పూర్తిగా విద్యుత్తు బ్యాటరీలతో నడిచే కార్లపై ఏమూలో అనుమానం ఉండడంతో వీరంతా హైబ్రిడ్ కార్లను కొనేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
నగరంలో అనుకూలం.. జాతీయ రహదారులపై సురక్షితం : విద్యుత్తుతోపాటు పెట్రోల్ డీజిల్తోపాటు నడిచే హైబ్రిడ్ కార్లు నగర పరిస్థితులకు అనుకూలంగా ఉండడం, జాతీయ రహదారులపై సురక్షితంగా ప్రయాణించవచ్చన్న భావనతోనే ఎక్కువమంది వీటిని కొనేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని కొందరు ఆటోమొబైల్ ఇంజినీర్లు చెబుతున్నారు. నగరంలోని ట్రాఫిక్ పరిస్థితుల దృష్ట్యా ఎక్కడా రద్దీ సమయాల్లో ఎక్కడా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వెళ్లలేమని, హైబ్రిడ్ కార్ల తయారీలో ప్రత్యేకతల దృష్ట్యా గంటకు అరవై కిలోమీటర్లు, ఆలోపు వేగంతో వెళ్లినప్పుడు విద్యుత్తు బ్యాటరీతో నడుస్తుందని, జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల కంటే వేగంగా వెళ్లడంతో దానంతటదే పెట్రోల్ లేదా డీజిల్ను ఇంధనంగా మార్చుకుంటుందని వివరిస్తున్నారు. నగరంలో రద్దీ ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు బ్రేకులు వేయడం, పెట్రోల్ లేదా డీజిల్ను కార్లు ఎక్కువగా వినియోగిస్తాయని, విద్యుత్తు బ్యాటరీతో ప్రయాణిస్తే ఇంధనం ఆదాతో పాటు కాలుష్యం వెదజల్లబోదు.
రెండు, మూడు నెలల నిరీక్షణ..
ప్రముఖ కంపెనీల హైబ్రిడ్ కార్లకు గిరాకీ పెరుగుతుండడంతో కొనుగోలుదారులకు వెంటనే లభించడం లేదు. నగదు చెల్లించినా రెండు, మూడు నెలల తర్వాతే షోరూం నిర్వాహకులు డెలివరీ ఇస్తున్నారు. గతేడాది ఆగస్టు నుంచి హైబ్రిడ్ కార్ల కొనుగోళ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. నగరంలోని షోరూంలలో ప్రముఖ కంపెనీల కార్లు కొనేందుకు చాలామంది వస్తుండడంతో నిర్వాహకులు వారి వద్ద నుంచి బయానా మాత్రమే తీసుకుంటున్నారు. హైబ్రిడ్ కార్లపై సామాజిక మాధ్యమాలు, టీవీలు, ప్రత్యేక ప్రదర్శనల్లో వివరిస్తుండడంతో ధర ఎక్కువైనా సరే కొనేందుకు ముందుకు వస్తున్నారు. వీటికి ఉన్న డిమాండ్ దృష్ట్యా.. వేర్వేరు కంపెనీలు రూ.7.80లక్షల నుంచి రూ.20.59లక్షల(ఎక్స్ షోరూం ధర) వరకు పలు వేరియంట్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’