logo

Hyderabad: కూకట్‌పల్లిలో దంపతుల ఆత్మహత్య

కూకట్‌పల్లిలో దంపతులు మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు.  ఎస్సై చంద్రకాంత్‌, స్థానికుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి వెంకట్రావునగర్‌ కాలనీలోని రోడ్డు నం-9లోని ఓ ఇంట్లో సోమిరెడ్డి (65), మంజుల (58) దంపతులు ఉంటున్నారు.

Updated : 01 Feb 2023 09:05 IST

ఉరేసుకున్న భార్య, క్రిమి సంహారక మందు తాగిన భర్త

మూసాపేట, న్యూస్‌టుడే: వృద్ధ దంపతులు మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. కూకట్‌పల్లి ఎస్సై చంద్రకాంత్‌, స్థానికుల వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి వెంకట్రావునగర్‌ కాలనీలోని రోడ్డు నం-9లోని ఓ ఇంట్లో సోమిరెడ్డి (65), మంజుల (58) దంపతులు ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మియాపూర్‌లో, చిన్న కుమారుడు విదేశంలో ఉంటున్నారు. గాజులరామారంలో ఉంటున్న మంజుల సోదరుడు వెంకటరెడ్డి.. సోమిరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్లు చేసినా తీయకపోవడంతో ఆయనే స్వయంగా వచ్చి చూడగా ఇద్దరూ చనిపోయి ఉన్నారు. మంజుల ఉరేసుకుని ఉండగా సోమిరెడ్డి నేలపై పడి ఉన్నాడు. అతని నోటి నుంచి నురగలు రావడాన్నిబట్టి ఏదైనా క్రిమి సంహారక మందు తాగి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అనారోగ్య సమస్యల కారణంగానే వారు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని