గమ్యం చేరని ప్రయాణాలు
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తనయుడు ప్రశాంత్కుమార్రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్రలో మంగళవారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది.
నగరంలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
నగర రహదారులు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన రెండు ప్రమాదాల్లో నలుగురు మరణించారు. అవుటర్ రింగ్రోడ్డుపై జరిగిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఎర్రగడ్డ వద్ద జరిగిన మరో ఘటనలో కుమార్తెతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను డీసీఎం ఢీకొనగా భార్య మృత్యువాత పడింది. యాచారం పరిధిలో జరిగిన మరో దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
అవుటర్పై కంటైనర్ను కారు ఢీకొని ఇద్దరు..
ప్రమాదంలో గాయపడ్డ చిన్నారులు మృతిచెందిన కారు డ్రైవర్ ముస్తఫా షేక్
రాజేంద్రనగర్, బండ్లగూడజాగీర్: బాహ్య వలయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు. రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన వెంకటగణపతి(48), జైత్రి(41), విరాట్(11), శ్రియ(9), మరో వ్యక్తి(35), మంగళవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో దిగి కారులో ఔటర్ మీదుగా సోలాపూర్ బయలుదేరారు. తెలంగాణ పోలీసు అకాడమీ సమీపంలో ముందు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి వేగంగా ఢీకొట్టారు. ప్రమాదంలో కారు నడుపుతున్న ముస్తఫా షేక్(40), జైత్రి ఘటనా ప్రదేశంలోనే తుదిశ్వాస వదిలారు. మిగతా నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
తోడుగా వచ్చి.. ఒంటరిని చేసి
సెలవడిగేందుకు భర్తతో వెళ్లిన భార్య..
సంజీవరెడ్డినగర్, న్యూస్టుడే: అనారోగ్యం కారణంగా సిక్ లీవ్ లెటర్ ఇవ్వడానికి తన కార్యాలయానికి బయల్దేరిన భర్తకు తోడు వెళ్లిన భార్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. సనత్నగర్ ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. యూసుఫ్గూడ ఎస్పీఆర్హిల్స్వాసి ఎస్.భరత్(36) బీహెచ్ఈఎల్ ఆర్టీసీ డిపోలో మెకానిక్గా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న భరత్.. సెలవులేఖ ఇవ్వడానికి బయల్దేరారు. తోడుగా ఆయన భార్య ఎస్.మమత(30) రెండున్నరేళ్ల కుమార్తెతో కలిసి స్కూటీపై ఉదయం 11గంటలకు వెళ్లారు. ఇచ్చి తిరిగొస్తుండగా ఎర్రగడ్డ వంతెనపై స్టీల్రాడ్ల లోడు డీసీఎం వీరి స్కూటీని వెనుకనుంచి ఢీకొంది. ముగ్గురూ రోడ్డుపై పడిపోగా మమత తలకు బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భరత్ గాయాలతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి క్షేమంగా బయటపడింది. డీసీఎం డ్రైవర్పరారయ్యాడు. కేసు నమోదుచేశారు.
ప్రగతి నివేదన యాత్రలో అపశ్రుతి.. వృద్ధుడి మృతి, 9 మందికి గాయాలు
జంగయ్య
యాచారం, న్యూస్టుడే: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తనయుడు ప్రశాంత్కుమార్రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్రలో మంగళవారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. యాచారం మండలం గడ్డమల్లయ్యగూడెంలో యాత్ర తిలకించడానికి వచ్చిన గ్రామస్థులు, కార్యకర్తలపైకి ట్రాక్టర్ దూసుకురావడంతో 9మంది గాయపడ్డారు. ఒకరు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ఈ యాత్ర మంగళవారం సాయంత్రం గడ్డమల్లయ్యగూడెంకు చేరుకుంది. విరామ సమయంలో ప్రశాంత్కుమార్రెడ్డి అల్పాహారం తీసుకుంటున్నారు. కార్యకర్తలు ప్రధాన రహదారి పక్కన నిల్చుని ముచ్చట్లలో మునిగారు. డ్రైవరు శంకరయ్య నడుపుతున్న ట్రాక్టర్ జనంపైకి దూసుకొచ్చింది. తులేకుర్దుకు చెందిన చెందిన రాజశేఖర్రెడ్డి(45), గడ్డమల్లయ్య గూడెంవాసులు విజయమోహన్రెడ్డి(65), నర్రె జంగయ్య(85), లచ్చయ్య(60), బీరప్ప(60), బౌరమ్మ50, రాములమ్మ(70) భారతమ్మ(55), ఇక్కె మల్లమ్మ(56), నర్సమ్మ(45) గాయపడ్డారు. ఇబ్రహీంపట్నంలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జంగయ్య మృతి చెందాడు. పోలీసులు డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యంమత్తులో ఉన్నాడని స్థానికులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విదేశాలకు వెళ్లాల్సింది.. అనంతలోకాలకు..
[ 24-04-2024]
విదేశాలలో ఉన్నత చదువుకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న ఓ యువకుడిని బస్సు రూపంలో మృత్యువు వెంటాడింది. -
ఎండలో తిరుగుతున్నారా.. జాగ్రత్త!
[ 24-04-2024]
క్రమంగా ఎండలు పెరుగుతున్నాయి. పగలు ఎండ వేడి తీవ్రమైన నేపథ్యంలో దాని తీవ్రత నుంచి రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎం.రాజారావు సూచించారు. -
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
[ 24-04-2024]
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యానిమేషన్ సినిమా కథ రచయిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం ఎస్ఐ మన్మథ]రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
ఆన్లైన్ రుణం.. తీసుకోకున్నా నరకం
[ 24-04-2024]
లోన్యాప్ నేరగాళ్లు మరో అడుగు ముందుకేసి సరికొత్త పద్ధతుల్లో నరకం చూపిస్తున్నారు. ఇప్పటివరకు యాప్ల ద్వారా రుణం ఇచ్చి.. -
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
[ 24-04-2024]
జియాగూడలోని ఫ్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలాచార్యులు (55) హఠాన్మరణం చెందారు. -
సికింద్రాబాద్ స్టేషన్లో టిక్కెట్ కౌంటర్ల పెంపు
[ 24-04-2024]
వేసవి సెలవులు ఇవ్వడంతో ప్రయాణాలు పెరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. క్యూఆర్ కోడ్తో టిక్కెట్లు తీసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ప్రయాణికులు బారులు తీరాల్సి వస్తోంది. -
హనుమా.. నగర శోభ కనుమా
[ 24-04-2024]
రామలక్ష్మణ జానకీ.. జై బోలో హనుమాన్కీ నినాదాలు.. డప్పు చప్పుళ్లు, డీజే మోతలు.. యువత కేరింతలు.. పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య వీర హనుమాన్ విజయయాత్ర ఘనంగా జరిగింది. -
బలం ఉంది.. భరోసా కొరవడింది
[ 24-04-2024]
రాజధాని పరిధిలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారాసకు బలమైన నేతలున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే చాలు దూసుకుపోయే క్యాడర్ ఉంది. -
నేతల చూపు యువత వైపు
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటున్న దరిమిలా నేతలు నెమ్మదిగా ప్రచారంపై దృష్టి సారిస్తున్నారు. పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. -
నాయకుల హుషారు.. నామినేషన్ల జోరు
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మంగళవారం 48 నామినేషన్లు దాఖలయ్యాయి. -
ప్రజారోగ్యంతో బంతాట
[ 24-04-2024]
కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ నగరంలో ప్రజారోగ్యానికి భరోసా కొరవడింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారకల్తీని అరికట్టేందుకు ప్రభుత్వం 24 మంది ఆహార భద్రతాధికారులను నియమించగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నది ఏడుగురు మాత్రమే. -
ఓటేద్దాం.. వేయిద్దాం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల ఎన్నికల అధికారులు కె.శశాంక, గౌతమ్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. -
వర్షపు నీటిని ఒడిసి పడదాం..
[ 24-04-2024]
వర్షపు నీటిని ఒడిసిపట్టి రాజధానిలో భూగర్భ జలాలను పెంచడంతో పాటు ప్లంబర్లకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ది రెయిన్వాటర్ ప్రాజెక్టు’, జీహెచ్ఎంసీ, జలమండలి, ఈపీటీఆర్ఐ, పీసీబీ కలిసి ప్రారంభించిన ‘రెయిన్వాటర్ హార్వెస్టింగ్’ శిక్షణ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. -
కంటోన్మెంట్లో మూడు నామినేషన్లు దాఖలు
[ 24-04-2024]
ప్రస్తుతం తన చేతిలో రూ.1,45,000 నగదు, ఎస్బీఐ అశోక్నగర్ శాఖలో రూ.5 వేల నగదు, కార్ఖానా వాసవినగర్లోని కెనరా బ్యాంకులో -
ఉద్యానమా.. ఆక్రమించేద్దాం!
[ 24-04-2024]
చుట్టూ బహుళ అంతస్తుల భవనాలు.. గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలు.. దుండిగల్ మున్సిపాలిటీలోని మల్లంపేటకు కిలోమీటర్ దూరంలో బాహ్య వలయ రహదారి.. -
ఆదరిస్తే.. వందేళ్లకు సరిపడా అభివృద్ధి
[ 24-04-2024]
అయిదేళ్లపాటు జరిగే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ను ఆదరిస్తే పాలమూరు జిల్లాను వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
స్థానికంగా కీలకం.. ప్రగతిలో భాగస్వామ్యం
[ 24-04-2024]
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండటంతో ఎంపీ అభ్యర్థుల ప్రచార సందడి మొదలైంది. అభ్యర్థుల నామపత్రాల సమర్పణ సైతం తుది దశకు వస్తుండటంతో ప్రచారపర్వం వేగవంతం చేస్తున్నారు. -
విధులు నిర్వర్తించినా... ఓటేయొచ్చు!
[ 24-04-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల సంఘం పలు కార్యక్రమాలు చేపడుతోంది. -
ఐపీఎల్ మ్యాచ్.. అర్ధరాత్రి వరకు మెట్రో సేవల పొడిగింపు
[ 24-04-2024]
ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగే ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో సేవలు అర్ధరాత్రి వరకు పొడిగిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. -
విశ్రాంత ఐఏఎస్కు రూ.1.89 కోట్లకు టోకరా
[ 24-04-2024]
సైబర్ నేరగాళ్లకు చిక్కిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రూ.1.89 కోట్లు పోగొట్టుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన ఓ మహిళ ఫారెక్స్ ట్రేడింగ్ చేస్తే లాభాలు వస్తాయని ఈ మొత్తం కొట్టేసింది. -
తల్లి ప్రవర్తన నచ్చక.. హత్య చేసిన కుమారుడు
[ 24-04-2024]
తల్లి ప్రవర్తన నచ్చక కుమారుడే హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
కొరియర్ పేరుతో వైద్యురాలికి టోకరా
[ 24-04-2024]
కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ వచ్చిందని సైబర్ నేరస్థులు బెదిరించి వైద్యురాలి నుంచి నగదు కొట్టేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. -
మ్యాట్రిమోని వేదిక.. ఒంటరి మహిళలకు వల
[ 24-04-2024]
డిగ్రీ మధ్యలోనే ఆపేసిన ఓ యువకుడు సైబర్ నేరగాడి అవతారం ఎత్తాడు. వితంతువులు, విడాకులు తీసుకున్న ఒంటరి మహిళల్ని మ్యాట్రిమోని వేదికల ద్వారా సంప్రదించి పెళ్లి చేసుకుంటానంటూ మోసాలు చేస్తున్నాడు. -
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
[ 24-04-2024]
హైదరాబాద్ నగరంలోని యూసఫ్గూడలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక యువతిపై బస్సు ఎక్కడంతో తీవ్రగాయాలతో ఆమె మృతిచెందింది.
తాజా వార్తలు (Latest News)
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు