వక్ఫ్ భూములు.. ఉఫ్
నగర శివారులోని రూ.500 కోట్ల విలువైన 90 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను రౌడీషీటర్లు, పహిల్వాన్లు, కొంతమంది రాజకీయ నాయకులు దర్జాగా ఆక్రమించారు. ఆపైన ఈ స్థలాలను విక్రయించి రూ.కోట్లలో దండుకుంటున్నారు.
రూ.500 కోట్ల విలువైన 90 ఎకరాలపై గద్దల్లా వాలిన రౌడీషీటర్లు
బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలో కబ్జా బాగోతం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి -పహాడీషరీఫ్, న్యూస్టుడే
బడంగ్పేట కార్పొరేషన్ పరిధిలో బండరాళ్లు తొలగించి చేపడుతున్న నిర్మాణాలు
నగర శివారులోని రూ.500 కోట్ల విలువైన 90 ఎకరాల వక్ఫ్ బోర్డు భూములను రౌడీషీటర్లు, పహిల్వాన్లు, కొంతమంది రాజకీయ నాయకులు దర్జాగా ఆక్రమించారు. ఆపైన ఈ స్థలాలను విక్రయించి రూ.కోట్లలో దండుకుంటున్నారు. ఈ కబ్జా బాగోతం తెలిసినా రెవెన్యూ, పోలీసు, వక్ఫ్బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. అమాయకులు ప్లాట్లు కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. చారిత్రక పహాడీషరీఫ్ దర్గా పరిసరాల్లో ఈ తతంగం జరుగుతోంది.
బడంగ్పేట కార్పొరేషన్ మామిడిపల్లి, పహాడీషరీఫ్ పరిధిలోకి వచ్చే సర్వే నంబర్ 99/1లో 55 ఎకరాలు, సర్వే నంబర్ 96లో 35 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు అధీనంలో ఉంది. స్థల పరిరక్షణకు వారు చర్యలు తీసుకోకపోవడంతో పాతబస్తీకి చెందిన కొంతమంది రౌడీషీటర్లు, పహిల్వాన్ల కన్ను పడింది. వీరికి కొంతమంది రాజకీయ నాయకుల తోడ్పాటు లభించింది. దీంతో ఒక్కో రౌడీషీటరు, పహిల్వాన్ మూడు నుంచి అయిదు ఎకరాల వరకు అధీనంలోకి తీసుకున్నారు. స్థానిక సంస్థలకు చెందిన కొంతమంది తాజా, మాజీ ప్రతినిధులు కూడా రెండు ఎకరాల నుంచి ఆపైన భూమిని తమపరం చేసుకున్నారు. ఆక్రమించిన భూమిని ప్లాట్లు చేసి గజం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు. స్థలం రిజిస్ట్రేషన్ జరగనందున ఇద్దరి మధ్య ఒప్పందం మేరకే ఈ కొనుగోళ్లన్నీ పూర్తవుతున్నాయి. ఈ భూమిలో కొన్ని కొండలు కూడా ఉన్నాయి. రాత్రిపూట వీటిని పగలగొట్టి ఇంటి స్థలంగా మార్చి అమ్మకాలు చేపడుతున్నారు. బడంగ్పేట కార్పొరేషన్ అధికారులు ఈ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కిందిస్థాయి అధికారులకు అమ్యామ్యాలు అందడంతో డోరు నంబర్లు, విద్యుత్తు, నీటి కనెక్షన్లు కూడా ఇచ్చేస్తున్నారు.
* అంతా రౌడీషీటర్లకేనా మేమూ ఉన్నామంటూ ఓ మాజీ సర్పంచి ఏకంగా అయిదు ఎకరాలు ఆక్రమించారని స్థానికులు ఆరోపించారు. రాష్ట్ర మంత్రి పేరుతో అధికారులను సంబంధిత మాజీ సర్పంచి హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు.
రౌడీషీటర్ పేరుతో కాలనీ
ఓ రౌడీషీటర్ 12 ఎకరాలు ఆక్రమించి ప్లాట్లు చేసి విక్రయించాడు. కొనుగోలు చేసిన వారు ఇక్కడ నిర్మాణాలు చేపట్టారు. ఈ కాలనీకి రౌడీషీటరు తన పేరే పెట్టాడు. వక్ఫ్ స్థలంలో ఇదేం ఆక్రమణ అని అడిగితే సంబంధిత రౌడీషీటరు ఓ ఎస్సైతో కల్సి ప్రశ్నించిన వారిపైనే కేసులు పెడతామని బెదిరింపులకు దిగుతున్నాడు.
ఆక్రమణలపై చర్యలు తీసుకుంటాం..
- జనార్దనరావు, తహసీల్దారు, బాలాపూర్
99/1, 96 సర్వే నంబరులో భూములు వక్ఫ్బోర్డుకు సంబంధించినవి. సిబ్బందిని పంపించి పరిశీలన చేస్తాం. ఆక్రమణలు ఉంటే స్వాధీనం చేసుకుంటాం. ఎన్ని ఆక్రమణలైనా గుర్తించి వక్ఫ్ స్థలాలను కాపాడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రిజర్వేషన్ల రద్దే భాజపా అజెండా: సీఎం రేవంత్రెడ్డి
[ 25-04-2024]
70 ఏళ్లుగా అమలులో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని భాజపా తలపెట్టిందని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
[ 25-04-2024]
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ