logo

న్యాయస్థానంలో ‘కంటి వెలుగు’

వికారాబాద్‌ జిల్లా న్యాయస్థానం ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శీతల్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంత్‌లతో పాటు వంద మంది వరకు న్యాయవాదులు కంటి పరీక్షలు చేయించుకున్నారు.

Published : 02 Feb 2023 03:21 IST

వికారాబాద్‌, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లా న్యాయస్థానం ఆవరణలో కంటి వెలుగు కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శీతల్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీకాంత్‌లతో పాటు వంద మంది వరకు న్యాయవాదులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. కంటి వెలుగు కార్యక్రమం ఎంతో అద్వితీయమైనదని న్యాయమూర్తి శీతల్‌ అన్నారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు మాధవరెడ్డి, లక్ష్మణ్‌, కార్యదర్శి జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని