KTR: మనం ఎందుకు అలా ఆలోచించడం లేదు?: కేటీఆర్
భారత్లో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని.. మన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఎందుకు ఆలోచన చేయడం లేదు అని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్: భారత్లో ఆర్థిక అభివృద్ధి కన్నా రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడతారని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్హెచ్ఆర్డీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డీకోడ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. భారత్లోనూ ఎంతో మంది గొప్పవారు, తెలివైన నేతలున్నారని.. అయితే మెరుగైన ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలకు మనకన్నా మంచి భవితను అందించే అంశాలపై వారు దృష్టి పెట్టట్లేదన్నారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఏడాదంతా ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయని.. వారి దృష్టంతా ఎన్నికలపైనే ఉంటుందన్నారు. దేశంలో ఇప్పుడున్న ప్రధాన సమస్య ఇదేనని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
‘‘బుధవారం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అప్పటికే అనేక రాష్ట్రాలు తమ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాయి. కానీ దేశ అభివృద్ధి కోసం కేటాయింపులు చేసినట్లు ఎక్కడ కనిపించలేదు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. మనదేశంలో 60 శాతం జనాభా యువతే. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయి. మన యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుంది. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఎందుకు మనం ఆలోచన చేయడం లేదు? ఎవరో ఉద్యోగాలు సృష్టిస్తారని ఎదురుచూడటం ఎందుకు? మన దేశం నుంచి ప్రపంచ స్థాయిలో గుర్తించదగిన బ్రాండ్స్ ఎందుకు రావడం లేదు? ఆవిష్కరణలు చేస్తూ చిన్న చిన్న దేశాలు ముందుకు వెళ్తున్నాయి. సింగపూర్ మన హైదరాబాద్ కన్నా చిన్నగా ఉంటుంది. కానీ ఇవాళ ఆర్థిక వ్యవస్థ విషయంలో వేగంగా ముందుకెళ్తుంది.
దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర గణనీయమైనది. దేశ జీడీపీలో 5 శాతం వాటా రాష్ట్రానిదే. తెలంగాణ 3ఐ (ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూజివ్ గ్రోత్) విధానంతో ముందుకెళ్తోంది. టీఎస్ ఐపాస్తో కంపెనీలకు ఆన్లైన్లోనే 15 రోజుల్లో అనుమతులిస్తున్నాం. 16వ రోజు అనుమతి రాకపోతే ఆటోమేటిగ్గా అనుమతి ఇచ్చినట్టే అవుతుంది. అమెజాన్కు చెందిన ప్రపంచంలోనే పెద్ద క్యాంపస్ హైదరాబాదులోనే ఉంది. గూగుల్, ఉబర్ లాంటి కంపెనీలు వాటి సెకండ్ క్యాంపస్లను అమెరికా తర్వాత హైదరాబాద్లోనే ఏర్పాటు చేసుకున్నాయి. ఇతర దేశాల మాదిరిగా భారత్లోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే భారత్ నంబర్ వన్ దేశంగా ఎదుగుతుంది’’ అని కేటీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.