పావుగంట దాటితే.. రెండింతలు
ఆయనో ప్రైవేటు కంపెనీలో సీనియర్ అధికారి. రెండు రోజుల క్రితం తన తల్లిదండ్రులు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వస్తుండగా.. వారిని తీసుకురావడానికి పదో నంబర్ ప్లాట్ఫాం వైపు కారులో రాత్రి పదింటి సమయంలో వెళ్లారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ‘నిలుపు’ దోపిడీ
వాహనదారులపై పార్కింగ్ సిబ్బంది దౌర్జన్యం!
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: ఆయనో ప్రైవేటు కంపెనీలో సీనియర్ అధికారి. రెండు రోజుల క్రితం తన తల్లిదండ్రులు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వస్తుండగా.. వారిని తీసుకురావడానికి పదో నంబర్ ప్లాట్ఫాం వైపు కారులో రాత్రి పదింటి సమయంలో వెళ్లారు. లోపలికి వెళ్లేటప్పుడు సాధారణంగా పార్కింగ్ బూత్ దగ్గర రశీదు ఇస్తారు. రాత్రి కావడంతో అక్కడున్నవారు రశీదు ఇవ్వలేదు. తిరిగి తల్లిదండ్రులను తీసుకుని బూత్ దాటి ఇంటికి వెళ్లినప్పుడు కూడా అక్కడి వారు ఛార్జి కోసం అడగలేదు. ఆయన స్టేషన్ నుంచి కిలోమీటరు దాటి వెళ్లిన తరువాత వెనుక నుంచి దృఢకాయులైన నలుగురు ద్విచక్రవాహనాలపై వచ్చి ఆ అధికారి కారుకు అడ్డుగా వచ్చి దౌర్జన్యం చేయబోయారు. ఛార్జి ఇవ్వకుండా ఎలా వెళ్లిపోతారంటూ దురుసుగా ప్రవర్తించారు. ఛార్జి కింద రూ.500 ఇస్తేనే కారు కదలనిచ్చేదంటూ హుకుం జారీచేశారు. తల్లిదండ్రుల ముందు గొడవ ఎందుకన్న ఉద్దేశంతో వారికి డబ్బులిచ్చి కదిలారు. ముందుగా రశీదు ఇచ్చి తరువాత ఛార్జి వసూలు చేస్తే ఇచ్చేవాడినిగానీ ఇలా దౌర్జన్యం చేయడం దారుణమంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
* సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా ప్రయాణికులపై దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయి. విమానాశ్రయంలో వసూలు చేసినట్లు కార్లు, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఇంత ఛార్జీని ఇవ్వలేమంటే ప్రయాణికులను సిబ్బంది బెదిరిస్తున్న దాఖలాలున్నాయి. ఫిర్యాదు చేసినా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* సికింద్రాబాద్ స్టేషన్లో పది ప్లాట్ఫాంలున్నాయి. ఒకటో నంబర్ ఫ్లాట్ఫాం సికింద్రాబాద్ వైపు, పదో నంబర్ ఫ్లాట్ఫాం బోయగూడ వైపు ఉంటాయి. రెండు వైపులా రెండు రకాల పార్కింగ్ వ్యవస్థలున్నాయి. ఒకటి ప్రీమియర్ పార్కింగ్, రెండోది సాధారణ పార్కింగ్.
* ఈ క్రమంలో కొంతమంది వాహనదారులు వాగ్వాదానికి దిగితే కొన్నిసార్లు దౌర్జన్యాలు కూడా జరుగుతున్నాయి. పార్కింగ్ రుసుములు తగ్గించాలని చాలామంది రైల్వే అధికారులను కోరారు. రేట్లు తగ్గిస్తే తమకు ఆదాయం తగ్గుతుందన్న ఉద్దేశంతో అధికారులు ఒప్పుకోవడం లేదని ప్రయాణికుల సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి.
* ప్రీమియర్ పార్కింగ్లో ఛార్జీలు అదిరిపోతున్నాయి. స్టేషన్లోకి వెళ్లిన కారు 8 నిమిషాల్లో తిరిగొస్తే ఛార్జీ చెల్లించనవసరం లేదు. 8 నిమిషాలు దాటి 15 నిమిషాలైతే రూ.100, మరో 15 నిమిషాలు అదనంగా ఉంటే రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. తరువాత మరో 15 నిమిషాలుంటే రూ.500 ఛార్జి చెల్లించాల్సిందే. ఇలా ప్రతి 15 నిమిషాలకు రేటు పెరిగిపోతోంది. ఇలా రూ.వేలల్లో చెల్లించాల్సి వస్తోంది.
* సాధారణ పార్కింగ్లోనూ రేట్లు అధికంగా ఉంటున్నాయి. ద్విచక్ర వాహనానికి మొదటి గంటకు రూ.20 తరువాత ప్రతి గంటకు రూ.20 చొప్పున వసూలు చేస్తున్నారు. 24గంటలపాటు ఇక్కడ ద్విచక్ర వాహనాన్ని పార్కింగ్ చేస్తే జీఎస్టీతో కలిపి రూ.566 వసూలు చేస్తున్నారు. కారుకు మొదటి గంటకు రూ.40 చొప్పున తరువాతి ప్రతి గంటకు రూ.40 చొప్పున 24గంటలకు జీఎస్టీతో కలిపి రూ.1132 వసూలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
[ 19-04-2024]
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
[ 19-04-2024]
ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బలవంతంగా భూమి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో.. హైదరాబాద్ సైబర్క్రైమ్ ఏసీపీ చాంద్బాషా, రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకట రంగారెడ్డిపై కేసు నమోదైంది. -
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
[ 19-04-2024]
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ల్లో ఆకతాయిలు రెచ్చిపోయారు. వాణిజ్య సముదాయాల అద్దాలను ధ్వంసం చేశారు. -
పొయినచోటే ‘చే’జిక్కించుకోవాలని..
[ 19-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న చోటే లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను అమలు చేయడం మొదలుపెట్టింది. -
రూ.లక్ష కోట్లతో అభివృద్ధి చేశా.. ఆదరించండి
[ 19-04-2024]
సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంతో పాటు.. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం సుమారు రూ.1.10 లక్షల కోట్లు ఇచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి జి. కిషన్రెడ్డి అన్నారు. -
తొలిఘట్టం మొదలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
[ 19-04-2024]
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. -
ఎక్కడిక్కడే నీటి శుద్ధి!
[ 19-04-2024]
మహానగరం విస్తరిస్తోంది. శివార్లలో భారీ నిర్మాణాలు వెలస్తున్నాయి. వేసవి కావడంతో నగరంలో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. -
భాజపా, ఆర్ఎస్ఎస్లతో హైదరాబాద్కు ముప్పు: ఒవైసీ
[ 19-04-2024]
భాజపా, ఆర్ఎస్ఎస్లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్ హైదరాబాద్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. -
అక్రమార్కులకు అండదండలు
[ 19-04-2024]
భూతగాదాల్లో కొందరు పోలీసులు అడ్డగోలుగా జోక్యం చేసుకుంటున్నారు. స్టాండర్ట్ ఆపరేషన్ ప్రొసీజర్(ఎస్వోపీ) ప్రకారమే భూముల సమస్యల్లో ముందుకెళ్లాలని నిబంధనలున్నా.. -
రక్తదాన శతకం.. ‘చిరు’ సత్కారం
[ 19-04-2024]
వందసార్లు చిరంజీవి రక్త, నేత్రనిధి కేంద్రంలో రక్తదానం పూర్తి చేసి చరిత్ర సృష్టించిన సినీనటుడు మహర్షి రాఘవను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు, మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు. -
మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
[ 19-04-2024]
దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. -
లష్కర్లో బోణీ కొడతాం: కేటీఆర్
[ 19-04-2024]
తెలంగాణలో తాము గెలవబోయే మొదటిసీటు సికింద్రాబాద్ (లష్కర్) అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
గిన్నిస్బుక్లో చోటు సాధించిన అజయ్కుమార్
[ 19-04-2024]
ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర, తెలంగాణ రాష్ట్రాల ఎస్ఎంఈ ఛాంబర్స్ ఆఫ్ ఇండియా సలహాదారు డాక్టర్ అజయ్కుమార్ అగర్వాల్ గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. -
శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
[ 19-04-2024]
శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) సిగలో మరో అంతర్జాతీయ పురస్కారం చేరింది. -
వారసత్వ కట్టడాలు జాతీయ సంపదలో భాగమే
[ 19-04-2024]
రాష్ట్రంలో అరుదైన, అద్భుతమైన చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు ఎన్నో ఉన్నాయని, వాటి పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజల సహకారం అవసరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనగణనలో కులగణనకు కేంద్రంపై ఒత్తిడి పెంచాలి: ఆర్.కృష్ణయ్య
[ 19-04-2024]
జనగణనలో కులగణన కోసం అన్ని రాజకీయ పార్టీల నేతలు ఏకమై.. లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. -
సివిల్స్ ర్యాంకర్కు సన్మానం
[ 19-04-2024]
ఇటీవల విడుదలైన యూపీఎస్సీ ఫలితాలలో 231 ర్యాంకు సాధించిన అభ్యర్థిని రాజేంద్రనగర్ ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు గురువారం సన్మానించారు. -
ఆరోగ్య కూలీలకే ‘ఉపాధి’ అవకాశం
[ 19-04-2024]
వేసవిని దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కింద చేపట్టే పనులకు అనారోగ్యానికి గురైన కూలీలను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. -
తొలిఘట్టం మొదలైంది..
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తొలిరోజునే రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు తమ నామినేషన్ పత్రాలను చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు గురువారం సమర్పించారు. -
చిలుకూరి బాలాజీ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
[ 19-04-2024]
తెలంగాణ తిరుమలగా వెలుగొందుతున్న చిలుకూరుబాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. -
నోడల్ అధికారులు బాధ్యతగా పనిచేయాలి
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్ర కీలకమని, అందరి విధులపై అవగాహన పెంచుకుని, బాధ్యతగా పనిచేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి(డీఈవో) రోనాల్డ్ రాస్ ఆదేశించారు. -
గొంతు తడప తరలివచ్చే కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా జంటనగరాలు, జిల్లా వాసుల దాహం తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు జలమండలి అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి. -
మధ్యాహ్నం బస్సుల్లేక హైరానా
[ 19-04-2024]
ఆర్టీసీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. -
పనిచేసిన చోట జీతం రాక.. తల్లీ చెల్లిని పోషించలేక యువకుడి బలవన్మరణం
[ 19-04-2024]
భర్త చనిపోయినా పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులను కూలి పని చేసుకుంటూ కంటికి రెప్పలా ఆ తల్లి కాపాడుకుంది.. పెంచి పెద్ద చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ