రివాల్వర్తో సంచారం
భూవివాదంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రివాల్వర్తో దిగిన తన చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో ఉంచాడు. అది వైరల్ కావడంతో.. పోలీసులు ఆ వ్యక్తిని ఠాణాకు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.
సామాజిక మాధ్యమంలో చిత్రం హల్చల్
పోలీసుల కౌన్సెలింగ్
దోమ: భూవివాదంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రివాల్వర్తో దిగిన తన చిత్రాన్ని సామాజిక మాధ్యమంలో ఉంచాడు. అది వైరల్ కావడంతో.. పోలీసులు ఆ వ్యక్తిని ఠాణాకు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. దోమ ఠాణా పరిధిలో జరిగిన ఘటన వివరాలు.. ఎస్ఐ విశ్వజన్ కథనం ప్రకారం.. దోమ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి భూ వివాదంలో నిందితుడు. కొన్ని రోజుల కిందట బెయిలుపై విడుదలయ్యాడు. పక్క మండలంలో ఉన్న న్యాయవాదికి చెందిన అనుమతి ఉన్న రివాల్వర్తో ఫొటో దిగి ఓ సామాజిక మాధ్యమ గ్రూపులో పోస్టు చేశాడు. విషయం తెలిసిన పోలీసులు ఠాణాకు పిలిచారు. రివాల్వర్ ఎలా పొందాడు?గ్రూపులో ఎందుకు పోస్టు చేశాడు? తదితర వివరాలపై విచారించి, కౌన్సెలింగ్ నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం