logo

తల్లికి వేధింపులు... కుమారుడికి 18 రోజుల జైలు

కన్న తల్లిని వేధించిన కుమారుడికి కోర్టు 18 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. చాదర్‌ఘాట్‌ ఠాణా ఎస్సై పాండు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్‌మలక్‌పేట పాపయ్యబస్తీకి చెందిన శకుంతలకు ముగ్గురు కుమారులు.

Published : 03 Feb 2023 01:42 IST

చాదర్‌ఘాట్‌, న్యూస్‌టుడే: కన్న తల్లిని వేధించిన కుమారుడికి కోర్టు 18 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. చాదర్‌ఘాట్‌ ఠాణా ఎస్సై పాండు తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్‌మలక్‌పేట పాపయ్యబస్తీకి చెందిన శకుంతలకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు సురేష్‌(33) జులాయిగా తిరుగుతుండే వాడు. వివాహం అనంతరం భార్యతో కలిసి మల్కాజిగిరిలో ఉంటున్నాడు. అప్పుడప్పుడు తల్లి దగ్గరికి వచ్చి డబ్బులివ్వాలంటూ కొట్టడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించేవాడు. కొడుకు చేష్టలతో విసుగు చెందిన ఆమె చాదర్‌ఘాట్‌ ఠాణాలో గత డిసెంబరు 27న ఫిర్యాదు చేసింది. పోలీసులు అరెస్టు చేయగా 6వ ప్రత్యేక మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఎస్‌.లక్ష్మణ్‌రావు గురువారం తీర్పు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని