ఠాణా.. వసతుల ఖజానా
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లిలో నిర్మించిన పోలీస్స్టేషన్ నూతన భవనానికి ఆధునిక సదుపాయాలు సమకూర్చారు. ఎత్తైన కొండను తొలిచి.. దాదాపు రూ.4 కోట్ల విరాళాలతో దీనిని నిర్మించారు.
బాచుపల్లిలో రూ.4 కోట్ల విరాళాలతో నిర్మాణం
నిజాంపేట, న్యూస్టుడే
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాచుపల్లిలో నిర్మించిన పోలీస్స్టేషన్ నూతన భవనానికి ఆధునిక సదుపాయాలు సమకూర్చారు. ఎత్తైన కొండను తొలిచి.. దాదాపు రూ.4 కోట్ల విరాళాలతో దీనిని నిర్మించారు. అందులో అధునాతన సదుపాయాలు కల్పించారు. త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు.
సీఎస్ఆర్ (కామన్ సోషల్ రెస్పాన్సిబులిటీ) పథకం కింద భవన నిర్మాణ ఖర్చును అరబిందో ఫార్మా కంపెనీ భరించింది. మిగతా వసతులు సమకూర్చేందుకు దాతలు ముందుకొచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో మహిళలు, పురుష సిబ్బందికి వసతి, ప్రత్యేక స్టోర్రూం ఏర్పాటుచేశారు. 300 మందికి సరిపోయే భోజనశాల ఏర్పాటుచేశారు. భవిష్యత్తులో సేవల్ని విస్తరించినా రెండు దశాబ్దాలకు సరిపోయేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆరుగురు ఎస్సైలు పనిచేస్తుండగా.. మరో 10 మందికి పైగా విధులు నిర్వర్తించవచ్చు. భవనం ఎదుట అశోక చక్రం, నాలుగు సింహాలతో 28 అడుగుల నల్లటి ఏకశిల స్తూపాన్ని కాంచీపురంలో ప్రత్యేకంగా తయారుచేయించారు. ‘‘రాష్ట్రంలోనే అత్యధిక సదుపాయాలు, ఆధునికంగా నిర్మించిన ఈ ఠాణాను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తార’’ని బాచుపల్లి సీఐ కె.నర్సింహారెడ్డి పేర్కొన్నారు.
* పోలీస్స్టేషన్కు ప్రభుత్వం కేటాయించిన స్థలం : 1.31 ఎకరాలు
* స్టేషన్ విస్తీర్ణం: 2,100 చదరపు అడుగులు. మూడు అంతస్తులు
* మొదటి అంతస్తు: అధికారులు, ప్రజలకు అనుసంధానమైన సేవలు
* నిర్మాణం ప్రారంభం : 10.04.2021
* రెండు..: అధికార కార్యకలాపాలకు సంబంధించిన మల్టీపర్పస్ కాన్ఫరెన్స్హాల్, నేర, కంప్యూటర్ వంటి ఇతర విభాగాలతోపాటు సీసీ టీవీలకు ఆఫ్టికల్ ఫైబర్ సాయంతో 1,400 కెమెరాలను అనుసంధానం చేశారు. మరో 4 వేల కెమెరాలను కూడా అనుసంధానం చేసే సౌకర్యముంది. వీటిని జూబ్లీహిల్స్లోని రాష్ట్ర కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేయనున్నారు.
* మరిన్ని వసతులు: లిఫ్టు, వికలాంగులకు ర్యాంపు, ట్రైసైకిళ్లు, 4 ఆర్వో ప్లాంట్లు, 2 సూట్ రూంలు, గ్రానైట్బెంచీలు, పిల్లలకు క్రీడా పరికరాలు, వాటర్ ఫౌంటెన్, వ్యూపాయింట్, గెజిబ్ (సేదతీరే ప్రదేశం), బాలీథిమ్, పార్కింగ్, పరేడ్ గ్రౌండ్, వర్షపునీరు వృథాపోకుండా భారీ ఇంకుడు గుంత.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ పాలనతోనే గ్రామాల్లో మార్పు: కొండా
[ 29-03-2024]
కేంద్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అనేక రకాలుగా మార్పు వచ్చిందని చేవెళ్ల పార్లమెంట్ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా గురువారం మిట్టకంకల్, కడ్మూరు, మేడిపల్లి కలాన్ గ్రామాల్లో పర్యటించారు. -
మహమ్మారిపై అప్రమత్తత అవసరం
[ 29-03-2024]
ప్రమాదకర ఎయిడ్స్పై అప్రమత్తత అవసరమని, ఎయిడ్స్పై సందేహాలు ఉన్నవారు ఉచిత హెల్ప్లైన్ నంబరు 1097ను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ జీవరాజ్ అన్నారు. -
బ్యాలెట్ పెట్టెలో ఫలితం నిక్షిప్తం
[ 29-03-2024]
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఏ ఒక్క ఓటూ చేజారిపోకుండా జాగ్రత్త పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 1,439 ఓట్లకుగాను 1,437 ఓట్లు పోలయ్యాయి. -
ఇసుక అక్రమ నిల్వ.. అదనుచూసి విక్రయం
[ 29-03-2024]
తాండూరు పరిసరాల్లోని కాగ్నా, కాకర వేణి నదుల నుంచి కొల్లగొడుతున్న ఇసుకను అక్రమార్కులు తమకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేస్తున్నారు. నదుల్లో అనుమతుల పేరిట తవ్వకాలు ఆగిపోయినపుడు నిల్వ చేసిన ఇసుకను డిమాండును బట్టి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
[ 29-03-2024]
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్