మూడొంతులకు ముప్పే
నగరంలో ఐదంతస్తుల ఎత్తులోపు ఉన్న 80 శాతం వాణిజ్య భవనాల్లో పూర్తిస్థాయిలో అగ్నినిరోధక వ్యవస్థ లేదని అధికారుల తాజా పరిశీలనలో వెలుగులోకి వచ్చింది.
నగరంలో 80 శాతం వాణిజ్య భవనాల్లో నిప్పునార్పే వ్యవస్థే లేదు!
అధికారుల క్షేత్రస్థాయి పరిశీలనలో నిగ్గు తేలిన నిజం
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి
ఇటీవల ఆజామాబాద్ పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎగసిపడుతున్న మంటలు
నగరంలో ఐదంతస్తుల ఎత్తులోపు ఉన్న 80 శాతం వాణిజ్య భవనాల్లో పూర్తిస్థాయిలో అగ్నినిరోధక వ్యవస్థ లేదని అధికారుల తాజా పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ నిజాన్ని నిగ్గుతేల్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సంబంధిత భవన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు అగ్నిమాపక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సర్కారు సిద్ధమైంది. క్షేత్రస్థాయిలో వాణిజ్య భవనాల పరిశీలన కోసం కమిటీలను ఏర్పాటు చేసింది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రక్రియను మొదలుపెట్టారు.
నగరంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అగ్నిమాపక చట్టంలో 15 మీటర్ల ఎత్తులో అంటే ఐదంతస్తుల వరకు ఉన్న వాణిజ్య భవనాల నిర్మాణం సమయంలో అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలన్న నిబంధన లేదు. దీంతో సదరు భవన యజమానులు చాలామంది ఫైర్సేఫ్టీ ఏర్పాటు చేయడం లేదు. కొందరు భవనాలను ఏకంగా గోదాములుగా మార్చేసి అగ్నిప్రేరేపిత నిల్వలను ఉంచుతున్నారు. ఈ కారణంగానే అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అగ్నిమాపక, విద్యుత్తు, బల్దియా విజిలెన్సు అధికారులతో కమిటీలను రూపొందించింది. ఈ కమిటీలు భవనాల పరిశీలన ప్రారంభించాయి. సంబంధిత భవనంలో అగ్నినిరోధక వ్యవస్థ ఉందా? విద్యుత్తు వైరింగ్ ఎలా ఉంది? ఎలాంటి వ్యాపారాలు జరుగుతున్నాయి? నిల్వలు ఏమైనా ఉన్నాయా? తదితర విషయాలను పరిశీలించారు.
మార్చినెలాఖరులోగా..
ఇప్పటికే బంజారాహిల్స్ రోడ్డు నెంబర్10లో పెన్షన్ ఆఫీస్ నుంచి పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ వరకు ఇరువైపులా ఉన్న వాణిజ్య భవనాల పరిశీలనను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటివరకు 575 భవనాలను పరిశీలిస్తే అందులో 80 శాతం వాటిలో అగ్నినిరోధక వ్యవస్థ లేదని తేలింది. నగరవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని భావించాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నగరంలో 15 మీటర్ల ఎత్తులోపు ఉన్న చిన్నాపెద్దా వాణిజ్య భవనాలు లక్షకుపైగా ఉన్నాయని అంచనా. వచ్చే మార్చి నెలాఖరులోగా ఈ పరిశీలన పూర్తి చేసి, మే నెల నాటికి అన్ని భవనాల్లో ఫైర్సేఫ్టీ వ్యవస్థ ఏర్పాటు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బల్దియా సీనియర్ అధికారి ఒకరు ‘ఈనాడు’కు తెలిపారు.
నూతన సచివాలయం చెంత అప్రమత్తం
ఖైరతాబాద్, న్యూస్టుడే: నూతన సచివాలయ భవనంలో అగ్ని ప్రమాదం నేపథ్యంలో పోలీసుల అప్రమత్తమయ్యారు. తెలుగు తల్లి కూడలి నుంచి ఎన్టీఆర్ మార్గ్ వెళ్లే దారిని మూసేస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. సచివాలయంలో చోటుచేసుకున్న సంఘటనపై పోలీసులను సంప్రదించగా నోరు మెదపడంలేదు. తమకెలాంటి ఫిర్యాదు రాలేదని.. ఏం జరిగిందో తమకు తెలియదని సమాధానం దాటవేశారు. మీడియా ప్రతినిధులను భవనం లోపలికి వెళ్లేందుకు నిరాకరించారు.
గ్రీన్ ఛానల్ కంటితుడుపు చర్యేనా?
ఈనాడు, హైదరాబాద్: అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రతిస్పందించి ఘటనా స్థలానికి చేరుకోవడంలో ట్రాఫిక్ ప్రధాన అడ్డంకిగా మారింది. ట్రాఫిక్ విభాగం గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేస్తున్నా అది కేవలం కంటి తుడుపు చర్యగానే ఉండటంతో ఘటనా స్థలానికి చేరుకోవడంలో సుమారు 5 నుంచి 15 నిమిషాల వ్యవధి పెరుగుతోంది. ఈ లోపు నష్టం జరిగిపోతోంది. అగ్నిమాపకశాఖ నివేదిక ప్రకారం.. గతేడాది నగరంలో 881 అగ్నిప్రమాదాలు సంభవిస్తే అందులో 12 మంది మరణించగా.. రూ.9.2 కోట్ల ఆస్తినష్టం సంభవించింది.
ట్రాఫిక్తో ఇక్కట్లు... అగ్నిమాపక వాహనాలు పదుల సంఖ్యలో కూడళ్లను దాటుకొని వస్తుండడంతో వేగం మందగిస్తోంది. అతి కష్టం మీద సిగ్నల్ వద్దకు చేరుకుంటే తప్ప ఈ గ్రీన్ఛానెల్ ఉపయోగపడటం లేదు. దీంతో ఒక్కో సిగ్నల్ వద్ద సుమారు 2 నుంచి 3 నిమిషాల సమయం పడుతుంది. ఈ వృథాను తగ్గించేలా సిగ్నళ్ల వద్ద మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
నేతలు రోడ్డెక్క.. ప్రచారం వేడెక్కె
[ 26-04-2024]
రాజధానిలో లోక్సభ ఎన్నికల్లో ప్రచారం వేడెక్కింది. మొన్నటివరకు అభ్యర్థులు ఖరారు కాకపోవడం.. ఎండలు మండిపోతుండటంతో జనంలోకి వెళ్లడానికి నేతలు వెనకాముందాడారు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీల్లో కదలిక వచ్చింది. -
కేరింతలతో హోరెత్తె..
[ 26-04-2024]
సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. -
నగరాన.. సీఎం సుడిగాలి పర్యటన
[ 26-04-2024]
సీఎం రేవంత్రెడ్డి గురువారం నగరంలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మధుయాస్కి తల్లి మృతి చెందడంతో ఉదయం హయత్నగర్లోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. -
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
[ 26-04-2024]
ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
[ 26-04-2024]
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
స్మార్ట్గా ఓటర్లకు చేరువ
[ 26-04-2024]
ఎన్నికలంటే పార్టీలు, అభ్యర్థుల పాటలతో బస్తీలు మార్మోగేవి. కార్యకర్తలు, అభిమానులు పార్టీ జెండాలు, కండువాలతో పెద్దఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించేవారు. -
దోమా దోమ.. ఇంధనం ఏదమ్మాఝ
[ 26-04-2024]
జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోపిడీకి చిరునామాగా మారింది. ఫాగింగ్ పేరుతో కొందరు జోనల్ స్థాయి అధికారులు డీజిల్ను అమ్మేసుకుంటున్నారు. -
టీఎస్బీపాస్తోనే అనుమతులు
[ 26-04-2024]
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను హెచ్ఎండీఏ పరిధిలో ఇక నుంచి ఏకగవాక్ష పద్ధతిలో జారీ చేయనున్నారు. గతంలో అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ స్టేట్ లేఅవుట్ అండ్ బిల్డింగ్ పర్మిషన్ ఆమోదం, స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ(టీఎస్బీపాస్) ద్వారానే అనుమతులు మంజూరు చేస్తారు. -
ముగిసిన మొదటి పర్వం
[ 26-04-2024]
రాజధానిలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారంతో ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యాయి. -
రూ.వంద కోట్లు దాటినా.. ఇచ్చింది సున్నా
[ 26-04-2024]
శివార్లలో మురుగు నిర్వహణకు సంబంధించి నిధుల విడుదలలో బల్దియా జాప్యంతో జలమండలి మల్లగుల్లాలు పడుతోంది. 13 నెలలుగా ఒక్క పైసా కూడా బల్దియా నుంచి జలమండలి ఖాతాకు జమ కావడంలేదని అధికారులు వాపోతున్నారు. -
జేఈఈ మెయిన్స్లో సత్తా
[ 26-04-2024]
ఇంజినీర్ కావడానికి ఐఐటీల్లోనే చదవాలన్న సంకల్పంతో రెండేళ్లు వారు అహర్నిశలు కష్టపడ్డారు. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటారు. వంద శాతం పర్సంటైల్ సాధించి ప్రతిభ కనబరిచారు. -
శేషగిరికి కన్నీటి వీడ్కోలు
[ 26-04-2024]
విధుల్లో ఉన్న సమయంలో ఏకే-47 తుపాకీ ప్రమాదవశాత్తు పేలడంతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శేషగిరి(47)కు నగరవాసులు కన్నీటి వీడ్కోలు పలికారు. -
తలసరి ఆదాయమేకాదు.. కరెంట్ వినయోగంలోనూ టాప్
[ 26-04-2024]
ఐటీ సంస్థలు.. ఏరో సెజ్లు.. డాటా కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం.. పరిశ్రమలు.. ఈ-మొబిలిటీ వ్యాలీ.. ఆకాశహార్మ్యాలు... కన్వెన్షన్ సెంటర్లు.. వినోద కేంద్రాలు.. విద్యాసంస్థలు.. వ్యవసాయ ఉత్పత్తులకు నిలయంగా ఉన్న రంగారెడ్డి జోన్ పరిధిలో అత్యధిక కరెంట్ డిమాండ్ ఉంటోంది. -
ఐపీఎల్ టికెట్ల గోల్మాల్పై చర్యలకు డిమాండ్
[ 26-04-2024]
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల గోల్మాల్, బ్లాక్ దందాపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి డిమాండ్ చేశారు. -
మంగళ్ హాట్ ఠాణా
[ 26-04-2024]
శాంతిభద్రతలపరంగా మంగళ్హాట్ ఠాణా అతి సున్నితమైంది. పోలీస్ స్టేషన్లో కొందరు అధికారులు, సిబ్బంది అవినీతి, అక్రమాలతో అప్రతిష్ఠ మూటగట్టుకుంటోంది. -
నినాదాల హోరు.. కాంగ్రెస్ శ్రేణుల జోరు
[ 26-04-2024]
రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన రోడ్డుషో సందడిగా సాగింది. ఉప్పర్పల్లిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. -
అధ్యాపకుల కొరత.. అసౌకర్యాల వెత
[ 26-04-2024]
జిల్లాలో ఈసారి ఇంటర్ ద్వితీయ ఫలితాలు ఒక మెట్టు కిందకే ఉండటం అటు అధ్యాపకులను, ఇటు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే సమయంలో ప్రథమ సంవత్సరంలో మాత్రం మెరుగైన ఫలితం రావడం అందరికీ సంతోషదాయకంగా ఉంది. -
దేవాదాయ భూముల రక్షణకు సమష్టి కృషి
[ 26-04-2024]
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అదనపు పాలనాధికారి లింగ్యానాయక్ అన్నారు. -
న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు
[ 26-04-2024]
ఉద్యోగ జీవితంలో బదిలీలు అనివార్య ప్రక్రియ అని రంగారెడ్డి జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎస్.శశిధర్రెడ్డి అన్నారు. -
ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
[ 26-04-2024]
వారం రోజులుగా అట్టహాసంగా కొనసాగిన చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు గురువారం చక్రస్నానం, ధ్వజావరోహణంతో ముగిశాయి. -
‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. -
రేవంత్రెడ్డి సభలో స్పృహ తప్పిన కార్యకర్త
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం అత్తాపూర్లో నిర్వహించిన రోడ్డుషోలో ప్రసంగిస్తుండగా ఆయన ముందున్న కార్యకర్తల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. -
రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి: రోనాల్డ్ రాస్
[ 26-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా పోలింగ్ సిబ్బంది, అధికారుల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్రాస్ పేర్కొన్నారు.