logo

పసికందును తీసుకుని మహిళ పరారీ

ఇప్పుడే వస్తా అంటూ తల్లికి చెప్పి పసి బాలుడిని తీసుకెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన గత నెల 27న జరగ్గా.. బాలుడి తల్లి శుక్రవారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Published : 04 Feb 2023 03:08 IST

శంషాబాద్‌: ఇప్పుడే వస్తా అంటూ తల్లికి చెప్పి పసి బాలుడిని తీసుకెళ్లిన ఓ మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన గత నెల 27న జరగ్గా.. బాలుడి తల్లి శుక్రవారం ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కర్నూల్‌కు చెందిన మహమ్మద్‌-ఫాతిమా దంపతులకు ఎనిమిదేళ్ల లోపు నలుగురు పిల్లలు ఉన్నారు. ఉపాధి కోసం శంషాబాద్‌కు వచ్చారు. అదే ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళ ఫాతిమాను పరిచయం చేసుకుంది. జనవరి 27న ఉదయం ఫాతిమా కుమారుడు హసన్‌(14 నెలలు)ను ఆ మహిళ ఇప్పుడే వస్తానంటూ  తీసుకొని వెళ్లి తిరిగి రాలేదు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని