అనంతగిరికి ఆయుష్ ఆస్పత్రి మంజూరు
అనంతగిరిలో ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు అడుగు ముందుకు పడింది. ఇంటిగ్రేటెడ్ 50 పడకల దవాఖానా మంజూరైందని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు.
తొలివిడత రూ.6కోట్ల విడుదలకు అంగీకారం
ఎంపీ రంజిత్రెడ్డి
వికారాబాద్, న్యూస్టుడే: అనంతగిరిలో ఆయుష్ ఆసుపత్రి ఏర్పాటుకు అడుగు ముందుకు పడింది. ఇంటిగ్రేటెడ్ 50 పడకల దవాఖానా మంజూరైందని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. శుక్రవారం పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు సమాధానంగా, కేంద్ర ఆయుష్శాఖ మంత్రి సర్భానందసోనోవాల్ బదులిచ్చారని, జాతీయ ఆయుష్ మిషన్(నామ్) కింద ఏర్పాటు చేయనున్నామని చెప్పారన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆయుష్శాఖ కలిసి రూ.7.57 కోట్లు మంజూరు చేయగా, తొలివిడత రూ.6 కోట్లు విడుదల చేయడానికి అంగీకారం కుదిరిందని చెప్పారు. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించారన్నారు. 2016-17లోనే అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసిందని చెప్పారు. ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గడువు విధించలేదని, నామ్ నిబంధనల ప్రకారం డయోగ్నోసిస్, పరికరాలు, ఔషధాలు తదితర సామగ్రి ఉండాలని కేంద్ర మంత్రి చెప్పారన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: చాలా కార్లు అమ్మేసిన విరాట్.. కారణం చెప్పేసిన స్టార్ బ్యాటర్
-
Crime News
TSRTC: బైక్ ఢీకొనడంతో ప్రమాదం.. దగ్ధమైన ఆర్టీసీ రాజధాని బస్సు
-
India News
India Corona: అమాంతం 40 శాతం పెరిగి.. 3 వేలకు చేరిన కొత్త కేసులు
-
Movies News
Tollywood:యాక్టింగ్తో అలరించి.. టేకింగ్తో మెప్పించి.. రెండు పడవలపై ప్రయాణించిందెవరంటే?
-
India News
Rahul Gandhi: ‘అప్పీల్ చేసుకునే స్థితిలోనే..’: రాహుల్ అనర్హతపై జర్మనీ స్పందన
-
Temples News
తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి.. భీష్ముడిగా నిలిచి..