నిధే పెన్నిధి.. చేరానలి సన్నిధి!
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6వ తేదీన ప్రవేశపెట్టనున్న పద్దుపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
బడ్జెట్పై జిల్లా వాసుల ఆశలు
న్యూస్టుడే, తాండూరు
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6వ తేదీన ప్రవేశపెట్టనున్న పద్దుపై జిల్లా వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సేద్యమే ప్రధాన ఆధారం కావడంతో జలాశయాల మరమ్మతుకు అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. విద్య, వైద్యం, తదితర రంగాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతాయని ఆశిస్తున్నారు.
వసతులు కల్పిస్తేనే పర్యాటకం
అనంతగిరి అడవులు 3,500 ఎకరాల్లో విస్తరించాయి. ఔషధ వృక్షాలతో కూడిన కొండలను సందర్శించేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పర్యాటకులు వచ్చి వెళుతుంటారు. ఇక్కడే కొలువు దీరిన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటారు. దగ్గరిలో కోట్పల్లి జలాశయంలో బోటింగ్ నిర్వహిస్తారు. వారాంతపు రోజుల్లో వేల మంది వస్తారు. ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండడంతో పాటు పీల్చే ప్రాణవాయువు చాలా స్వచ్ఛమైంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిస్తే ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.
కంది బోర్డు తప్పనిసరి
నాణ్యమైన కంది పంట సాగయ్యే తాండూరు కేంద్రంగా బోర్డు ఏర్పాటు చేయాలను ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. రెండు దశాబ్దాలుగా ఇదే విషయమై రైతులు కోరుతున్నారు. ఇది సాకారమైతే విత్తనాలు, ఎరువులకు ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. పొలంలో విత్తనాలు వేసిన నాటి నుంచి దిగుబడులు చేతికి అందే వరకు అధికారులు పర్యవేక్షిస్తారు. ఉత్పత్తులను కొనుగోలుకు వ్యాపారులు పోటీ పడతారు. దీంతో గిట్టుబాటు ధర కంటే ఎక్కువ లభిస్తుంది. గత డిసెంబరులో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాండూరు కంది పప్పునకు భౌగోళిక గుర్తింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో దేశీయంగా కంది ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1.48 లక్షల ఎకరాల్లో కంది పంట సాగవుతోంది. ఇటీవల తాండూరు పర్యటనకు వచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసికెళతానని రైతులకు హామీ ఇచ్చారు.
చిరకాల కోరిక ‘పాలమూరు-రంగారెడ్డి’
తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల ప్రజల తాగు, సాగు నీటి ఎద్దడిని తీర్చే ప్రాజెక్టు ఇది. కృష్ణా నది నుంచి ఎత్తిపోతల ద్వారా జిల్లాకు నీరు వస్తే ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు అందుతుంది. కోట్పల్లి జలాశయం ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ఆరుతడి పంటల సాగుకు ఎద్దడి ఉండదు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఏదుల, నర్సాపూరు ప్రాంత పొలాలకు నీరందించే ప్రాజెక్టు కరివేన, వట్టెం వద్ద పనులు పూర్తి కావస్తున్నాయి. ఉద్ధండాపూరు వద్ద ఇంకా పూర్తి కాలేదు. ఇవి పూర్తయితే ఆరు లక్షల ఎకరాల్లో, నాలుగు లక్షల వరకు ఆరుతడి పంటల సాగవుతాయి.
జలాశయాలకు..
జిల్లాలో 1,124 చెరువులు ఉన్నాయి. కోట్పల్లి, జుంటిపల్లి, లక్నాపూరు, సర్పన్పల్లి ప్రధాన జలాశయాలున్నాయి. ప్రభుత్వం నాలుగు విడతలుగా నిర్వహించిన మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు పడ్డాయి. శిథిలమైన తూములు, కాలువల మరమ్మతు పూర్తయింది. ప్రధాన ప్రాజెక్టుల కాలువలు, తూములు మరమ్మతుకు నోచుకోవడం లేదు. జలాశయాల్లో నీరున్నా చివరి ఆయకట్టుకు నీరందించే పరిస్థితి లేదు. మొత్తం 17,214 ఎకరాలకు కేవలం 7,500 ఎకరాలకు మాత్రమే నీరందుతోంది. కోట్పల్లికి రూ.40 కోట్లు, జుంటిపల్లికి రూ.10 కోట్లు, సర్పన్పల్లికి రూ.5 కోట్లు, లక్నాపూరు జలాశయానికి మరో రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.60 కోట్లు కావాలి.
ట్రామా కేంద్రం అత్యవసరం
బీజాపూరు జాతీయ రహదారిపై ప్రమాదాలకు గురయ్యే వారికి అత్యవసర చికిత్స అందించేందుకు తాండూరులో ట్రామా కేంద్రాన్ని ప్రారంభించారు. అవసరమైన వసతులు సమకూర్చేందుకు వైద్య విధానపరిషత్ రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఇవే నిధుల ఆధారంగా గదులను తీర్చిదిద్దారు. అవసరమైన వైద్య సిబ్బంది, పరికరాలను సమకూర్చ లేదు. రహదారి ప్రమాదాలు జరిగి ఆసుపత్రికి వస్తున్న వారికి సాంత్వన కలిగించే చికిత్స జరగడం లేదు. హైదరాబాద్కు పంపిస్తున్నారు. తాజాగా జిల్లా మీదుగా ఎన్హెచ్ 67(ఎన్) జాతీయ రహదారి నిర్మాణం పనులు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ట్రామా కేంద్రం ఏర్పాటుకు చొరవ చూపితే ప్రయోజనం ఉంటుంది.
జిల్లా కేంద్రానికి బాహ్యవలయ దారి
జిల్లా కేంద్రంగా ఉన్న వికారాబాద్ చుట్టూ బాహ్యవలయ రహదారి నిర్మాణం చేయాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. తాండూరు, పరిగి, సంగారెడ్డి, హైదరాబాద్ నుంచి వచ్చి పోయే భారీ వాహనాలు జిల్లా కేంద్రం మీదుగా వెళతాయి. ఇదే సమయంలో బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు, పాఠశాలల బస్సులు వంటి వేల వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీ వాహనాలు జిల్లా కేంద్రం వెలుపలి నుంచే వెళ్లేలా బాహ్యవలయ రహదారి నిర్మాణం కావాలి. పరిగి నియోజకవర్గం గండేడ్లో అధ్వానంగా ఉన్న రహదారుల మరమ్మతుకు నిధులు కావాలి. పరిగి నుంచి లాల్పహాడ్ రహదారిని అబివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్
[ 23-04-2024]
తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డికి బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. -
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం!
[ 23-04-2024]
యూసఫ్గూడలో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడి గణపతి కాంప్లెక్స్లో సెకండ్ హ్యాండ్ కార్లు విక్రయించే చోట ఈ ఘటన చోటుచేసుకుంది. -
అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి
[ 23-04-2024]
మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. -
పొరుగు నేతలకే పెద్దపీట
[ 23-04-2024]
గత రెండు నెలల్లో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్దఎత్తున నేతలు చేరిపోయారు. దీంతో రాజధానిలో అనేక నియోజకవర్గాల్లో బలపడ్డామని నాయకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉండటంతో ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. -
కొండంత విశ్వాసం
[ 23-04-2024]
చేవెళ్ల ఎంపీ స్థానానికి భాజపా అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్రెడ్డి సోమవారం భారీ ర్యాలీతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.c -
4 ఎంపీ స్థానాలకు 37 నామపత్రాలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు మొత్తం 37 మంది అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటికి ఆరుగురు.. ఎలా గురూ?
[ 23-04-2024]
రాజధానిలోని ఒక ఇంటి నంబరుపై గరిష్ఠంగా ఆరుగురు, కనిష్ఠంగా ముగ్గురు ఓటర్లున్నారు. చార్మినార్, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఆరు మంది ఓటర్లుండగా, సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో ముగ్గురేసి ఉన్నారు. -
చరవాణి హ్యాక్ చేసి.. రూ. 40.74 లక్షలు స్వాహా
[ 23-04-2024]
మొబైల్ ఫోన్ హ్యాక్ చేసి నగదు దోచేశారంటూ బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాలో సోమవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నగరానికి చెందిన వ్యాపారి ఫోన్కు ‘మీ ఖాతా బ్లాక్ చేయబడింది’ అంటూ సందేశం వచ్చింది. -
15 స్ట్రాంగ్ రూముల్లో.. 5వేల ఈవీఎంలు
[ 23-04-2024]
సికింద్రాబాద్, హైదరాబాద్ ఎంపీ స్థానాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికకు సంబంధించి ఈవీఎంలను సిద్ధం చేశామని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ వెల్లడించారు. -
అప్పుడు 38.5.. ఇప్పుడు 43.3
[ 23-04-2024]
నగరంలో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం 43.3 డిగ్రీలు నమోదైంది. -
ప్రతిదానికీ ఓ లెక్కుంది..!
[ 23-04-2024]
ఫలితాల వరకు ఈనాడు డిజిటల్, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే సికింద్రాబాద్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. -
రూ.72 లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
[ 23-04-2024]
నిర్మాణ ఒప్పందానికి సంబంధించి బ్యాంకు గ్యారంటీలు చెల్లించకుండా కాలయాపన చేసిన ఐసీఐసీఐ బ్యాంకుకు హైదరాబాద్ వాణిజ్య వివాదాల కోర్టు మొట్టికాయలు వేసింది. -
స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తు
[ 23-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలలుగా అధికారులు చేస్తున్న ఏర్పాట్లు ఒక్కొక్కటీ పూర్తవుతున్నాయి. ఎన్నికలకు అవసరమైన సరంజామా ఆయా నియోజకవర్గాలకు చేర్చారు. -
గుడిలో ఆభరణాల చోరీ కేసులో ముగ్గురి రిమాండ్
[ 23-04-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డులోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడు సహా మరో ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
రేవంత్రెడ్డికి పాలనా అనుభవం శూన్యం: పొన్నాల
[ 23-04-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పాలన అనుభవం శూన్యమని, అందుకే విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. -
సాంకేతిక ఉత్సవం.. విద్యార్థుల నైపుణ్యం
[ 23-04-2024]
జేఎన్టీయూ ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక నమూనాలతో సత్తాచాటారు. సోమవారం వర్సిటీలో రెండురోజుల సాంకేతిక ఉత్సవాల ప్రారంభం సందర్భంగా వివిధ విభాగాల్లో విద్యార్థులు ఏర్పాటుచేసిన నమూనాలు వారిలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటాయి. -
విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన డీసీఎం దగ్ధం
[ 23-04-2024]
పార్కింగ్ చేసిన ఓ డీసీఎం అగ్నికి ఆహుతైన సంఘటన శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. -
నీటి విక్రయం.. నాణ్యత ప్రశ్నార్థకం
[ 23-04-2024]
జిల్లాలో నాణ్యతలేని తాగు నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకుని అక్రమార్కులు రూ.లక్షల్లో సంపాదిస్తున్నారు. -
సీఎం సుడిగాలి పర్యటన నేడు
[ 23-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాలుగోసారి పాలమూరుకు రానున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే కొడంగల్, నారాయణపేట, మహబూబ్నగర్లో పర్యటించిన సీఎం మరోసారి పాలమూరులో నేడు (మంగళవారం) సుడిగాలి పర్యటన చేయనున్నారు. -
ప్రజలను మోసం చేసిన భాజపా, భారాస: కాంగ్రెస్
[ 23-04-2024]
మతతత్వ పార్టీలకు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గొట్లపల్లి, తట్టేపల్లి గ్రామాలు కేంద్రాలుగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. -
తనిఖీలు శూన్యం.. సౌకర్యాలు కనం
[ 23-04-2024]
తాండూరు ప్రాంతం నాపరాయి ఇతర జిల్లాలు..పొరుగు రాష్ట్రాలు..విదేశాలకు ఎగుమతి అవుతోంది. అంతటి పేరున్న నాపరాయిని వెలికితీసేందుకు వేలాది మంది కార్మికులు శ్రమిస్తున్నారు. -
ఆర్ఎంపీ, పీఎంపీలు నిబంధనలు పాటించాలి
[ 23-04-2024]
జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలు తమ పరిమితికి మించి వైద్య సేవలు అందించకూడదని, ఒకవేళ అందిస్తే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి పల్వన్కుమార్ సోమవారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ