ఖాతాలో వేశారు.. ఖాళీ చేసేశారు!
అన్నదాతలకు సాగు సమయంలో అక్కరకు వచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బంధు సాయం అందిస్తోంది. ఈ మొత్తం వారి పొదుపు ఖాతాలో జమైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు.
పాత బాకీ కింద రైతు బంధు జమ
న్యూస్టుడే, తాండూరు గ్రామీణ: అన్నదాతలకు సాగు సమయంలో అక్కరకు వచ్చే ఉద్దేశంతో ప్రభుత్వం రైతు బంధు సాయం అందిస్తోంది. ఈ మొత్తం వారి పొదుపు ఖాతాలో జమైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏ ఖాతా ఉన్నా సాయం వస్తుందన్న ఆశతో అనేకమంది రైతులు కేవలం పంట రుణం తీసుకున్న ఖాతానే కొనసాగిస్తున్నారు. రైతు బంధు సొమ్ము నేరుగా దీన్లో జమైతే బ్యాంక్ అధికారులు పాత బాకీల కింద జమ చేస్తున్నారు. విషయం తెలిసిన రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.
పరిమితుల్లేకుండా ఏటా రూ.10 వేలు
జిల్లా వ్యాప్తంగా 2.36లక్షల మంది రైతులు భూముల్ని కలిగి ఉన్నారు. వీరంతా సాగు ఖర్చుల నిమిత్తం వడ్డీ వ్యాపారుల, దళారుల బారిన పడకుండా సర్కారే రైతు బంధు కింద ఆర్థికసాయం అందిస్తోంది. 2018-19లో ఎకరాకు రూ.4వేల చొప్పున ఇచ్చారు. 2019-20లో రూ.5వేలకు పెంచింది. ఎలాంటి పరిమితులు లేకుండా ఏటా ఎకరాకు రూ.10వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది.
* రైతుబంధు సొమ్మును ప్రస్తుతం కొందరు బ్యాంకర్లు పంట రుణాలకు, ఇతర కార్పొరేషన్, స్వయం సహాయక సంఘాల రుణాల కింద జమ చేసుకుంటున్నారు. తాండూరు, ధారూరు, బొంరాస్పేట మండలాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. గత్యంతరంలేక అడ్తి దుకాణదారులు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ప్రైవేటు రుణాలు పొందుతున్నారు.
ఉదాహరణలు..
* తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన శాంతయ్యకు రైతు బంధు సొమ్ము ఎస్బీఐ ఖాతాలో జమైంది. నగదు పొందేందుకు వెళ్లగా పంట రుణం కింద జమ చేసుకున్నట్లు అధికారులు తెలపడంతో ఆయన బిక్కమొగం వేశారు.
* ధారూరు మండలం నాగసముందర్కు చెందిన నర్సింహులు రైతుబంధు సొమ్ము రూ.20వేలు ఖాతాలో పడింది. దాన్ని డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్తే పాత అప్పు కింద జమ చేసుకున్నట్లు బ్యాంకర్లు వెల్లడించారు. వెంటనే ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో వారు బ్యాంకర్లతో మాట్లాడి సొమ్ము తిరిగి అందించేలా చేశారు.
బ్యాంకర్లను ఆదేశించాం
- రాంబాబు, లీడ్ బ్యాంకు మేనేజరు
రైతు బంధు సొమ్మును పాత బాకీల కింద జమ చేయరాదని ఇప్పటికే జిల్లాలోని బ్యాంకర్లను ఆదేశించాం. ఈ సొమ్ము జమ చేసేందుకు పంట రుణం ఖాతాలకు బదులు పొదుపు ఖాతా వివరాలను సమర్పించాలి. పంట రుణం ఖాతాలో రైతుబంధు జమైతే నేరుగా రుణం కింద వెళ్లిపోయే ఆస్కారముంటుంది. మా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా