logo

గస్తీ వదిలి.. మత్తులో మస్తీ

ప్రజలకు రక్షణ కల్పించాల్సిన గస్తీ పోలీసులు.. విధులను విస్మరించి డ్యూటీ సమయంలో మద్యం తాగుతూ అడ్డంగా దొరికిపోయారు. పంజాగుట్ట పోలీసుల నిర్వాకం ఆలస్యంగా వెలుగు చూసింది.

Published : 05 Feb 2023 03:47 IST

పంజాగుట్ట పోలీసుల నిర్వాకం

మద్యం తాగుతున్న పోలీసులు

పంజాగుట్ట, న్యూస్‌టుడే: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన గస్తీ పోలీసులు.. విధులను విస్మరించి డ్యూటీ సమయంలో మద్యం తాగుతూ అడ్డంగా దొరికిపోయారు. పంజాగుట్ట పోలీసుల నిర్వాకం ఆలస్యంగా వెలుగు చూసింది. కానిస్టేబుల్‌ రామ్‌నాథ్‌, హోంగార్డు పీరయ్య ఈనెల 1న అర్ధరాత్రి ఎర్రమంజిల్‌లోని ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయం వెనుక తమ పెట్రోలింగ్‌ వాహనాన్ని పక్కన నిలిపి మద్యం తాగుతూ కూర్చున్నారు. ఫుట్‌పాత్‌ ప్రహరీ దిమ్మెపై ఎదురెదురుగా కూర్చుని జల్సా చేస్తుండగా అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీశారు. హఠాత్పరిమాణానికి నివ్వెరపోయిన పోలీసులు వీడియో తీయవద్దంటూ బతిమాలినా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని