25 రోజులు.. 14 గొలుసు చోరీలు
రాజధానిపై గొలుసు దొంగలు పంజా విసురుతున్నారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని ద్విచక్ర వాహనాలపై దూసుకొచ్చి తేలిగ్గా చోరీలకు తెగబడుతున్నారు.
అటకెక్కిన నిఘా.. కానరాని గస్తీ
రాచకొండ పోలీసులు ఇటీవల పట్టుకున్న ఆభరణాలు
ఈనాడు, హైదరాబాద్
* గతనెల 7న ఉప్పల్, నాచారం, రాంగోపాల్పేట, ఓయూ ఠాణాల పరిధిలో నాలుగు గంటల్లో ఏడు గొలుసు చోరీలు
* 11న అత్తాపూర్లో బంగారు గొలుసు, బ్రాస్లెట్ లాక్కెళ్లిన దుండగులు
* 13న ఎల్బీనగర్ కాకతీయ కాలనీలో నడిచి వెళ్తున్న మహిళ మెడలో గొలుసు చోరీ
* 23న ఆదిభట్లలో కల్లు విక్రయించే మహిళ గొలుసు, లంగర్హౌస్లో ఫుడ్ డెలివరీ బాయ్గా వచ్చి చైన్ స్నాచింగ్
* 25న చందానగర్ పీఎస్ పరిధిలో రెండు చోట్ల గొలుసు దొంగతనాలు
* 31న నిజాంపేటలో ఇంట్లోకి వెళ్తున్న మహిళ మెడలో చోరీ
రాజధానిపై గొలుసు దొంగలు పంజా విసురుతున్నారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని ద్విచక్ర వాహనాలపై దూసుకొచ్చి తేలిగ్గా చోరీలకు తెగబడుతున్నారు. ఈ ఏడాది జనవరి 7న ఉప్పల్, నాచారం, రాంగోపాల్పేట, ఉస్మానియా యూనివర్సిటీ ఠాణాల పరిధిలో బవారియా గ్యాంగ్ ఏడు గొలుసు చోరీలతో మొదలైన పరంపర.. నెల మొత్తం కొనసాగింది. దాదాపు 25 రోజుల వ్యవధిలో మూడు కమిషనరేట్ల పరిధిలో 14 చోరీలు నమోదయ్యాయి. దీంతో వీధుల్లో నడిచి వెళ్లాలంటే మహిళలు వణికిపోతున్నారు.
కొత్తవారిపై దృష్టి ఏదీ?
పోలీసులు పాత నేరస్థులపై.. కొత్త ముఠాల రాకపోకలపై దృష్టి పెట్టడం లేదు. పీడీ యాక్టు కింద జైల్లో ఉండి బయటికొచ్చి మళ్లీ నేరాల బాట పడుతున్నారు. ఇటీవల కూకట్పల్లి, ఎల్బీనగర్లో 23 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ వారిని హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి నేపథ్యాన్ని పరిశీలించగా అల్వాల్, చందానగర్, ఏపీలోని అనంతపురం, నంద్యాల ఠాణాల్లో 22 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఇంతటి ఘరానా దొంగలు నగరంలో మకాం వేసి... ఒక్కో విడత 10కిపైగా ఇళ్లల్లో చోరీలు చేసినా పోలీసులు పసిగట్టలేకపోయారు. ఒక నిందితుడిపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో 30 కేసులున్నాయి. యూపీకి చెందిన బవారియా గ్యాంగ్ షామ్లి జిల్లాలో పెద్దఎత్తున నేరాలకు పాల్పడ్డారు.
అంతర్రాష్ట్ర ముఠాలు తిష్ఠ వేసి...
నిఘా వైఫల్యం, అనుమానితుల కదలికలపై దృష్టి పెట్టకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. సెలవుల్లో, నిత్యం రాత్రిపూట గస్తీ కనిపిస్తున్నా గొలుసు చోరీ ముఠాల కట్టడిపై దృష్టి తగ్గిందని అధికారులే అంగీకరిస్తున్నారు. జనవరిలో చోరీలు.. పగటిపూట కాలనీలు, జన సంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్ వాహనాలు కనిపిస్తున్నా తెల్లారాక వాటి జాడ ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.