logo

మాతోనే సామాజిక న్యాయం: తెదేపా

తెలుగుదేశం పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు.

Published : 07 Feb 2023 04:06 IST

కార్యకర్తలతో బక్కని నర్సింహులు

దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీతోనే బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు. సోమవారం ఆయన దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేేశంలో కొడంగల్‌ నియోజకవర్గ బాధ్యుడు బాలకిశోర్‌ యాదవ్‌తో కలిసి మాట్లాడారు. త్వరలోనే రాష్ట్రంలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామంలో తెదేపా అభిమానులు, నాయకులు, కార్యకర్తలను కలిసి కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ మండల నాయకులు వల్గిరి నారాయణ, బిచ్చిరెడ్డి, చారి, మొగులప్ప, మాణిక్యప్ప, నరేందర్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని