logo

‘కాంగ్రెస్‌ పాలనతోనే దేశం సమైక్యం’

కేంద్రంలో కాంగ్రెస్‌ పాలనతోనే దేశం సమైక్యంగా ఉంటుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు.

Published : 07 Feb 2023 04:06 IST

నల్లకుంటలో ద్విచక్ర వాహనదారుడితో మాట్లాడుతున్న వి.హనుమంతరావు, మోత రోహిత్‌ తదితరులు

నల్లకుంట, న్యూస్‌టుడే: కేంద్రంలో కాంగ్రెస్‌ పాలనతోనే దేశం సమైక్యంగా ఉంటుందని మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు అన్నారు. హాత్‌ సే హాత్‌ జోడో యాత్రలో భాగంగా సోమవారం నల్లకుంట డివిజన్‌లో యువజన కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు మోత రోహిత్‌ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. పార్టీ నేతలు లక్ష్మణ్‌యాదవ్‌, రోహిణ్‌రెడ్డి, లక్‌పతి యాదగిరిగౌడ్‌, నారాయణస్వామి, శ్రీకాంత్‌గౌడ్‌, అభిజిత్‌, లక్ష్మణ్‌, శ్రీధర్‌గౌడ్‌, సునీత, ఫరీద్‌, రెహమాన్‌, వేదవ్యాస్‌, సాయికృష్ణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని